CM Jagan : ఉద్యోగుల సమ్మె.. సమస్యకు ముగింపు పలకాలని సీఎం జగన్ ఆదేశం

ఉద్యోగులు సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై సీఎం జగన్ చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

CM Jagan : ఉద్యోగుల సమ్మె.. సమస్యకు ముగింపు పలకాలని సీఎం జగన్ ఆదేశం

Cm Jagan

CM Jagan : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో సీఎం జగన్ కీలక సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఉద్యోగులు సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై సీఎం జగన్ చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతుండటంతో ప్రత్యామ్నాయ రవాణా చర్యలపై సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తే ఏ అంశాలు చర్చించాలనే అంశంపైనా డిస్కషన్ చేశారు. ఉద్యోగుల పీఆర్సీ, హెచ్ఆర్ఎ తదితర డిమాండ్లపైనా జగన్ చర్చించారు.

ఉద్యోగ సంఘాలు చర్చలకు వస్తే చర్చలు జరిపి పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యకు ముగింపు పలకాలని ఆదేశాలు ఇచ్చారు. జగన్ తో సమావేశం అనంతరం మంత్రుల కమిటీ క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రులు బుగ్గన, బొత్స, సీఎస్ సమీర్ శర్మ సచివాలయానికి వెళ్లారు. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు మరోసారి విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. ఉద్యోగ సంఘాల కోసం మంత్రుల కమిటీ సచివాలయంలో ఎదురు చూస్తోంది.

Stomach Problem : పొట్ట సమస్య బాధిస్తుందా!…పరిష్కారం మీ చేతుల్లో..?

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ‘చలో విజయవాడ’ చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

తమది బలప్రదర్శన కాదని.. ఉద్యోగుల వేదనే ‘చలో విజయవాడ’ అని పీఆర్సీ సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తామని.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం అన్నీ దొంగ లెక్కలు చెబుతోందని ఆరోపించారు. ఈ నెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపడతామని, ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఉద్యోగుల ఉద్యమమంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలన్నారు. మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారు, ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు.

పీఆర్సీ విషయంలో అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం.. వెనక్కి తగ్గడం లేదు. ఇరు వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే.. జీవోలు రద్దు చేయడం కుదరదని, అవసరమైతే మార్పులు చేస్తామని ప్రభుత్వం అంటోంది. ఉద్యోగులపై మేం ఎక్కడా ఒత్తిడి చేయలేదు. ఉద్యోగుల డిమాండ్లను మేం కాదనడం లేదు. కానీ, వాళ్లు చర్చలకు రావాలి కదా..? అని మంత్రులు అంటున్నారు.

Omicron: ఒమిక్రాన్ ఒకే మనిషికి మళ్లీ మళ్లీ వస్తదా..

ఉద్యోగులను ఎక్కడా భయపెట్టలేదని చెప్పారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇప్పుడు చూసినా ఉపయోగం లేదన్నారు. ఉద్యోగులు.. వ్యవస్థలో భాగస్వాములు అని, చర్చలకు రాకుండా తాము కోరుకున్నదే జరగాలంటే ఎలా? అని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు అన్యాయం చేయాలని సీఎం జగన్ భావించడం లేదని, చర్చలకు వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రులు స్పష్టం చేశారు.