CM YS Jagan: పిల్లలకు మంచి మేనమామలా.. గోరుముద్దలో రాగిజావను ప్రారంభించిన సీఎం జగన్..

జగనన్న గోరుముద్దలో మరో పౌష్టికాహారం చేరింది. రాగిజావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మంచి మేనమామలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. జగనన్న గోరుముద్దలో మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు. మూడు రోజులు రాగి జావ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.

CM YS Jagan: పిల్లలకు మంచి మేనమామలా.. గోరుముద్దలో రాగిజావను ప్రారంభించిన సీఎం జగన్..

AP CM YS Jagan

CM YS Jagan: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా బడి పిల్లలకు మరో పౌష్టికాహారం ప్రభుత్వం అందించనుంది. వారానికి మూడు రోజుల పాటు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పిల్లలకు మంచి మేనమామలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. జగనన్న గోరుముద్దలో మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు. వారంలో ఐదు రోజులపాటు ఉడికించిన గుడ్లు ఇస్తున్నామని, మూడు రోజులు చిక్కి ఇస్తున్నామని, మిగిలిన మూడు రోజులు మంగళ, గురువారం, శనివారాల్లో రాగి జావ ఇవ్వటం ఈ రోజునుంచి ప్రారంభించడం జరిగిందని జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యాసాయి ట్రస్టు భాగస్వాములు కావడం సంతోషకరమని, శ్రీ సత్యసాయి స్వామి వారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి ఉంటాయని భావిస్తున్నానని జగన్ అన్నారు. ఏడాదికి రూ.84 కోట్లు రాగిజావ కోసం ఖర్చు చేయనున్నామని, దీంతో గోరుముద్దకోసం చేస్తున్న ఖర్చు రూ.1910 కోట్లకు పెరుగుతుందని జగన్ తెలిపారు.

CM YS Jagan: ఎందుకు తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి..? ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ..

వైసీపీ ప్రభుత్వం హయాంలో మొదటిరోజు నుంచి అనేక అడుగులు వేశామని, బడిమానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా? స్కూళ్లలో సదుపాయాలను కల్పించడం ఎలా? మేథోవికాసాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అలోచించి అనేక చర్యలు చేపట్టామని అన్నారు. గర్భవతులైన మహిళల దగ్గరనుంచి చిన్నారులకు సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌, ఐఎఫ్‌ఎపీ ప్యానెల్స్‌ ఆరో తరగతి నుంచి ఏర్పాటు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం… ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గోరుముద్దను మరింత మెరుగ్గా చేయడానికే  ప్రయ్నతాలు చేస్తున్నామని, పిల్లలకు ఐరన్‌ కాని, కాల్షియం కాని పెరగడానికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 1 నుంచి 10 తరగతి పిల్లలకు దాదాపు 38లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని అన్నారు.

Ragi Java : ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీ.. మార్చి21న వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం జగన్

మొత్తం సంవత్సం అంతా కలిపినా కూడా గతంలో ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఉండేదని, ఆయాలకు 8-10 నెలలు బకాయిలు పెట్టే పరిస్థితి ఉండేదని, సరుకులు కూడా 6-8 నెలలుగా బకాయిలు పెట్టే పరిస్థితి ఉండేదని అన్నారు. ఇలా బకాయిల పెడితే… క్వాలిటీ అనేది ఉండదనే ఉద్దేశంతో గోరుముద్ద ద్వారా ప్రతిష్ట్మాతకంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు. ఇప్పుడు ఏడాదికి రూ.1824 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని జగన్ తెలిపారు. రోజుకో మెనూ ప్రకారం పిల్లలకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటూ ఉన్నారు అనే ఆలోచన చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ సీఎం జగన్ ఆల్‌ ది వెరీ బెస్ట్‌ చెప్పారు.