Konijeti Rosaiah: రోశయ్య మృతిపై.. సంతాపాల వెల్లువ
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపై.. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. ట్వీట్ రూపంలో తమ సందేశాన్ని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణంపై.. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమ ఆవేదనను, సందేశాన్ని.. ట్వీట్ చేస్తూ తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయపరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది. pic.twitter.com/du3n90Jv59
— Vice President of India (@VPSecretariat) December 4, 2021
Saddened by the passing away of Shri K. Rosaiah Garu. I recall my interactions with him when we both served as Chief Ministers and later when he was Tamil Nadu Governor. His contributions to public service will be remembered. Condolences to his family and supporters. Om Shanti. pic.twitter.com/zTWyh3C8u1
— Narendra Modi (@narendramodi) December 4, 2021
పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా… సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 4, 2021
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారి మరణం బాధాకరం.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ… వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను? pic.twitter.com/XcVAukC90M
— KTR (@KTRTRS) December 4, 2021
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మరణం బాధాకరం. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా అనేక పదవులు అలంకరించి, అమూల్యమైన సేవలు అందించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/22LleKkjaU
— Harish Rao Thanneeru (@trsharish) December 4, 2021
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆంధ్రోద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్యగారు ఐదు దశాబ్దాల పాటు ఎంతో అనుభవాన్ని గడించారు. సుదీర్ఘకాలం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు.(1/2) pic.twitter.com/09y6g05znW
— N Chandrababu Naidu (@ncbn) December 4, 2021
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను.సమున్నత వ్యక్తిత్వం,విషయపరిజ్ఞానం కలిగి,విలువలు పాటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రోశయ్య.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/1S3haYIz1g
— Lokesh Nara (@naralokesh) December 4, 2021
Shri #KonijetiRosaiah Garu #RestInPeace pic.twitter.com/jp8KPuWCuJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 4, 2021