Double Murder Case : టంగుటూరు జంట హత్యల కేసులో నిందితులు గుర్తింపు

ప్రకాశం జిల్లా టంగుటూరులో గతేడాది డిసెంబర్ 3వ తేదీన జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు గుర్తించారు.

Double Murder Case : టంగుటూరు జంట హత్యల కేసులో నిందితులు గుర్తింపు

tanguturu double murder case

Double Murder Case :  ప్రకాశం జిల్లా టంగుటూరులో గతేడాది డిసెంబర్ 3వ తేదీన జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ కందూకూరుకు చెందిన శివకోటయ్య, జరుగుమల్లికి చెందిన కిషోర్ గా అనుమానించిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గతేడాది డిసెంబర్ 3వ తేదీ శనివారం రాత్రి టంగుటూరులో బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్‌ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)ల ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రవికిషోర్‌ సింగరాయకొండ రోడ్డులో ఆర్‌.కె.జ్యూయలర్స్‌ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు.

గతేడాది డిసెంబర్ 3వ తేదీ రాత్రి గం.8-20 సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేదు. కుమార్తెకు ఫోన్ చేయగా కుమార్తె ఫోన్ నుంచి కూడా సమాధానం రాలేదు. దీంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లి చూడగా భార్య శ్రీదేవి, కుమార్తె వెంకట లేఖన(21)లు గొంతు కోసిన స్ధితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉన్నారు.

రవికిషోర్ ఈవిషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. వారి ద్వారా సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి దర్యాప్తు చేపట్టారు.