Cyclone Asani: ముంచుకొస్తున్న ‘అసని’: తూర్పు తీరానికి తీవ్ర తుఫాను హెచ్చరిక
తూర్పు తీరంలో అసని తుఫాను(cyclone Asani) ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని..2022లోనే మొదటి తుఫానుగా భారత వాతావరణశాఖ తెలిపింది.

Cyclone Asani: తూర్పు తీరంలో అసని తుఫాను(cyclone Asani) ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని..2022లోనే మొదటి తుఫానుగా భారత వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం అండమాన్ సముద్రం నుంచి బంగాళాఖాతం(ఉత్తరం) వైపు కదులుతున్న అసని మే 10న ఆంధ్ర – ఒడిశా లేదా ఒడిశా – పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో గాలుల వేగం 90 కి.మీ.ల వరకు ఉంటుందని అధికారులు హెచ్చరించారు. తుఫాను ధాటికి మే 8 నుంచి బెంగాల్, ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను నేపథ్యంలో అండమాన్ సహా..ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Also read:Autoimmune Diseases : ఆటో ఇమ్యూన్ వ్యాధులతో జాగ్రత్త!
తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపైనే ఉంటుందన్న అధికారులు ఆమేరకు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో ఒడిశా మొత్తం హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశారు. తుఫాను నేపథ్యంలో ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పికె జెనా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డిఆర్ఎఫ్, ఒడిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సూచన మేరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లినవారిని వెనక్కు పిలిపించినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు పికె జెనా వెల్లడించారు.
Well Marked Low Pressure area over South-East Bay of Bengal adjoining South Andaman Sea area. pic.twitter.com/ErRyx8UBpI
— Meteorological Centre, Bhubaneswar (@mcbbsr) May 7, 2022
మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీరంలోని విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు అసని తుఫాను ప్రభావం ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో స్థానిక విపత్తునిర్వహణశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, కుండపోత వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ సంచాలకులు వివరించారు. కాగా 2021 మే నెలలోను యాస్ తుఫాను తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.
Also read:Coronavirus: దేశంలో పెరిగిన కొత్త కొవిడ్ కేసులు.. 20వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
- Cyclone Asani Weakens : బలహీనపడిన అసని తుపాను.. భారీ నుండి అతి భారీ వర్ష సూచన
- Cyclone Asani Continues : ఏపీపై అసని తుపాను ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
- Cyclone Asani : ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం-తానేటి వనిత
- Cyclone Asani Effect : అసని తుపాను.. తీరానికి కొట్టుకొచ్చిన బంగారు మందిరం.. వింతగా చూస్తున్న జనం..!
- Cyclone Asani : అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష
1Weather Forecast: తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు.. రుతుపవనాల రాక ఎప్పుడంటే?
2Janhvi Kapoor : రొమాంటిక్ సినిమాలు చేయడానికి రెడీ అంటున్న జాన్వీ..
3PM Modi : నేడు ప్రధాని మోదీ నేపాల్ పర్యటన..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
4Sarkaru Vaari Paata : సినిమా రిలీజ్ అయ్యాక మహేష్.. డైరెక్టర్ పరశురామ్కి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా??
5Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన నూతన ప్రధాని..
6CM Jagan : నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం
7Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు.. నాకు ఎక్కువ పేరు వస్తుందని ఫీల్ అవుతారు..
8Suddala Ashok Teja : నా కొడుకే నాకు మళ్ళీ జన్మనిచ్చాడు..
9Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
10Jeevitha Rajasekhar : చిరంజీవికి మాకు ఎలాంటి విబేధాలు లేవు.. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు..
-
Girl Died : యాదగిరిగుట్టలో విషాదం… పుష్కరిణిలో పుణ్యస్నానానికి దిగి బాలిక మృతి
-
Unwilling Marriages : అమ్మాయిలకు శాపంగా మారుతున్న ఇష్టం లేని పెళ్లిళ్లు
-
Congress Party : కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
-
Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ
-
Plastic Rice : రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలకలం
-
Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యం : రాహుల్ గాంధీ
-
Guinness World Record: 75ఏళ్ల వ్యక్తి చేసిన ఈ ఫీట్తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్
-
CWC : ఉదయ్పూర్ డిక్లరేషన్కు ఆమోదం.. అధికారంలోకి వస్తే ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్!