Kuppam : కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా డా. సుధీర్

కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తైంది.. కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సుధీర్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నారు, వైస్ చైర్మన్‌గా అఫీస్, మునిస్వామిలు ప్రమాణం చేశారు.

Kuppam : కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా డా. సుధీర్

Kuppam (2)

Kuppam : ఇటీవల ఎన్నికలు జరిగిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక సోమవారం జరిగింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఛైర్మన్, వైస్ చైర్మన్‌ ఎన్నిక జరిగింది. వైసీపీ నేత డాక్టర్ సుధీర్ కుప్పం చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా అఫీస్, మునిస్వామిలు ప్రమాణం చేశారు.

చదవండి : Kuppam: కుప్పం కోటపై ఎగిరిన వైసీపీ జెండా

ఇక జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా రంగాపురం రాఘవేంద్ర ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా తుమ్మల ప్రభాకర్, షేక్ హఫీజ్ ఉన్నిస ఎన్నికయ్యారు. ఆకివీడు నగర పాలక సంస్థ చైర్ పర్సన్‌గా జామి హైమావతి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా పుప్పాల సత్యనారాయణ, వంగా జ్యోత్స్నాదేవిలను ఎన్నుకున్నారు కౌన్సిల్ సభ్యులు. ఇదిలా ఉంటే కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.

చదవండి : Kuppam : ప్రజలు బాబుకు దండం పెట్టేశారు : సజ్జల