Dollar Seshadri : ముగిసిన శేషాద్రిస్వామి అంత్యక్రియలు

గుండె పోటుతో మరణించిన టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంత్య క్రియలు ఈరోజు సాయంత్రం తిరుపతిలోని వైకుంఠ ప్రస్దానంలో ముగిసాయి.

Dollar Seshadri : ముగిసిన శేషాద్రిస్వామి అంత్యక్రియలు

Dollar Seshadri Funerals

Dollar Seshadri :  గుండె పోటుతో మరణించిన టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంత్య క్రియలు ఈరోజు సాయంత్రం తిరుపతిలోని వైకుంఠ ప్రస్దానంలో ముగిసాయి. ఆయన సోదరుడు రామానుజం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వైకుంఠ  ప్రస్థానంలోనూ  పలువురు  శేషాద్రి భౌతికకాయానికి పలువురు నివాళులు అర్పించారు. అంతిమ యాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అంతకు ముందు పాత ప్రస్తూతి ఆసుపత్రి సమీపంలోని శేషాద్రి నివాసం వద్ద ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శేషాద్రి పార్ధివ దేహంపై పుష్ప గుఛ్చం ఉంచి నివాళులర్పించారు. శే షాద్రి స్వామి కాలేజీలో తనకు సీనియర్ అని డిప్యూటి సిఎం శ్రీ నారాయణ స్వామి చెప్పారు. శేషాద్రి స్వామి   నిస్వార్థ పరుడని, చివరి శ్వాస వరకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవలోనే తరించారని చెప్పారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరారు.

వైసీపీ ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర రెడ్డి, టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీ చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహా దారు శ్రీ అజేయ కల్లం, ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ వైద్య నాథన్ కృష్ణ మూర్తి, చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి,టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ ఎ సి ఏ ఓ శ్రీ బాలాజి, టీటీడీ మాజీ ఈవో శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం, మాజీ జెఈవో లు శ్రీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీ శ్రీనివాస రాజు, తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ శ్రీ భూమన అభినయ్‌తో పాటు పలువురు టీటీడీ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, శ్రీ శేషాద్రి స్వామి పార్థివ దేహానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులు అర్పించారు.

కాగా శేషాద్రి ఇంటి వద్ద నుంచి హరిశ్చంద్ర స్మశానవాటిక వరకు అంతిమ యాత్ర జరిగింది. శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి, శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి తదితరులు పాడె మోశారు.