Andhra Pradesh : 40 మంది డీఎస్పీలకు పదోన్నతి
2012 బ్యాచ్ కి చెందిన 40 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
Andhra Pradesh : ఏపీలో 40 మంది డీఎస్పీ (సివిల్)లకు అదనపు ఎస్పీ (సివిల్)లుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2012 బ్యాచ్కు చెందిన ఈ డీఎస్పీల పదోన్నతుల అంశం ఐదేళ్లుగా పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో 40 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఓ కమిటీని నియమించి.. దాని సిఫార్సు మేరకు పదోన్నతి కల్పించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ మంగళవారం పదోన్నతికి సంబందించిన ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతి విషయంలో ఏదైనా అంశం కోర్టులో లేదా ట్రిబ్యునల్ లో ఉంటే.. వాటి తీర్పుకు లోబడి ఈ ఉత్తర్వులు అమలు చేస్తామని తెలిపారు.
అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన డీఎస్పీలు
వీబీ రాజ్ కమల్, కె.శ్రావణి, ఎం.చిదానందరెడ్డి, దిలీప్ కిరణ్ వండ్రు, కె.నాగేశ్వరరావు, అనిల్ కుమార్ పులపాటి, కె.సుప్రజ, జి.వెంకట రాముడు, హస్మా ఫరీణ్, పి.సౌమ్యలత, బి.విజయభాస్కర్, సి.జయరాంరాజు, ఇ.నాగేంద్రుడు, జి.వెంకటేశ్వరరావు, ఏవీ సుబ్బరాజు, కె.శ్రీలక్ష్మి, జి.రామకృష్ణ, ఆర్.రమణ, ఎ.శ్రీనివాసరావు, లింగాల అజయ్ప్రసాద్, జె.వెంకట్రావ్, సీహెచ్ సౌజన్య, ఏటీవీ రవికుమార్, మహేంద్ర మాతే, ఎ.రాజేంద్ర, బి.శ్రీనివాసరావు, ఏవీఆర్ పీవీ ప్రసాద్, బి.నాగభూషణరావు, పి.మహేశ్, జి.స్వరూపరాణి, టి.ప్రభాకర్ బాబు, జేవీ సంతోష్, నడికొండ వెంకట రామాంజనేయులు, డి.శ్రీ భవానీ హర్ష, డి.సూర్య శ్రావణకుమార్, డి.ప్రసాద్, జె.కులశేఖర్, కె.శ్రీనివాసరావు, పూజిత నీలం, ఎం.స్నేహిత.