Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..

ఒక్క తప్పిదం చేసిన కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే రకం. ఈ సారైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా...

Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..

Balakristhna

Balakrishna: ఒక్క తప్పిదం చేసిన కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే రకం. ఈ సారైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిందం చేశారు.. అనుభవిస్తున్నారు.. ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.

Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్

ఒకప్పుడు ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలని బాలకృష్ణ సూచించారు. ఓటు సక్రమంగా వేస్తేనే గుడి, బడి రెండు ప్రజలకు చేరులో ఉంటాయని, ఓటుతో ఆత్మభిమానంతో బ్రతుకుదాం అంటూ బాలకృష్ణ పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, తెలుగు జాతి గౌరవం నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. బడుగుబలహీన వర్గాలను అధికార పీఠంపై కూర్చోపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ గుర్తు చేశారు. విలువ మనిషికి కానీ తాను పుట్టిన కులానికి కాదని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు

తెలుగుదేశంకు ఉన్న బలమైన కార్యకర్తలు ఇంకో ఏపార్టీ కి లేరని, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. అంతకు ముందు కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ నివాళులర్పించారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.