కుప్పంకు జూ.ఎన్టీఆర్ రావాలన్న ఫ్యాన్స్..తల ఊపిన బాబు

కుప్పంకు జూ.ఎన్టీఆర్ రావాలన్న ఫ్యాన్స్..తల ఊపిన బాబు

Chittoor Kuppam : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఆయన పర్యటిస్తున్నారు. బాబు ఇలాకా అయిన..కుప్పంలో వెలువడిన ఫలితాలు టీడీపీని కలవరపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీడీపీకి కేవలం 13 మాత్రమే దక్కాయి. ఇలాంటి సమయంలో కుప్పంలో పర్యటిస్తున్నారు.

2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం బాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. కుప్పం, శాంతిపురం మండలాల్లో బాబుతో పాటు నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్లీలు దర్శనమివ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతిపురంకు చేరుకున్న బాబు కాన్వాయ్ వద్దకు కొంతమంది చేరుకున్నారు. కుప్పంకు జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రావాలని, ఆయన్ను ప్రచారంలో దింపాలని అభిమానుల డిమాండ్ కు బాబు నవ్వుతూ తల ఊపారు. జై..బాబు..జై జై బాబుతో ఆ ప్రాంతం మారుమ్రోగింది.

కుప్పం కోటాలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలతో మారుమోగింది. గురువారం నుంచి హల్ చల్ చేస్తున్నారు. గతంలో బాబు పలుమార్లు ఇక్కడకు వచ్చినా..ఇలాంటి ఫ్లెక్సీలు కనిపించలేదు. ప్రస్తుతం పార్టీ కార్యకర్తలకు ముందే దిశా..నిర్దేశం చేసి ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా..లేక..ఎవరికి వారు అభిమానులు ఏర్పాటు చేశారా ? అనేది ఆసక్తికరంగా మారింది.