Anantapur : తన పోలికలు లేవని పసిబిడ్డను హతమార్చిన తండ్రి
తన పోలికలతో లేదంటూ రెండు నెలల చిన్నారిని తండ్రి అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఈ అమానుష ఘటన అనంతరపురం జిల్లా కల్యాణదుర్గంలో చోటుచేసుకుంది.
Anantapur : తన పోలికలతో లేదంటూ రెండు నెలల చిన్నారిని తండ్రి అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఈ అమానుష ఘటన అనంతరపురం జిల్లా కల్యాణదుర్గంలో చోటుచేసుకుంది. మల్లికార్జున, చిట్టెమ్మ భార్య భర్తలు.. వీరికి రెండు నెలల క్రితం పాప పుట్టింది. పాపకు తన పోలికలు లేవంటూ నిత్యం చిట్టెమ్మను వేధించేవాడు మల్లికార్జున.. ఈ నేపథ్యంలోనే గురువారం పాపను ఇంట్లోంచి తీసుకెళ్లి నోటికి ప్లాస్టర్ వేసి చంపేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని గోనెసంచిలో వేసి సమీపంలోని చెరువులో పడేశాడు.
చదవండి : Murder At Anantapuram : తన భార్య గురించి చెడుగా చెప్పాడని.. వియ్యంకుడి హత్య
పాపను తీసుకెళ్లిన భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భార్య చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో పోలీసులకు ఫోన్ చేసిన మల్లికార్జున పాపను హత్యచేసి గోనెసంచిలో కట్టి చెరువులో పడేసి ఆ తర్వాత బెంగళూరు వెళ్లిపోయానని తెలిపాడు. దీంతో చెరువువద్దకు వెళ్లిన పోలీసులు బాలిక మృతదేహం వెలికితీశారు. అనంతరం నిందితుడు మల్లికార్జున కోసం గాలింపు చేపట్టారు. పోలీస్ బృందాన్ని బెంగళూరు పంపారు అధికారులు
చదవండి : Anantapur : కాంట్రాక్టర్ను బెదిరించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు