Gang Rape : పల్నాడులో ఒడిషా మహిళపై గ్యాంగ్ రేప్

పల్నాడులో దారుణం చోటు చేసుకుంది. గురుజాల రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు ఒడిషాకు చెందిన మహిళ(30)గా గుర్తించారు. మహిళతో  పాటు  2 సంవత్సరాల బాబు ఉన్నాడు. మహిళపై

Gang Rape : పల్నాడులో ఒడిషా మహిళపై గ్యాంగ్ రేప్

Gurajala Gang Rape

Gang Rape :  పల్నాడులో దారుణం చోటు చేసుకుంది. గురుజాల రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు ఒడిషాకు చెందిన మహిళ(30)గా గుర్తించారు. మహిళతో  పాటు  2 సంవత్సరాల బాబు ఉన్నాడు. మహిళపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలిసింది. అపస్మారకస్ధితిలో పడిపోయి ఉన్న మహిళను స్ధానికులు గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఘటనా స్ధలాన్ని సందర్శించారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.  రక్తనమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపామని ఆమె తెలిపారు.  స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. జీఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులకు అందిన ప్రాధమిక  సమాచారం మేరకు…. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు నిన్న రాత్రి రైల్వే స్టేషన్ లో మహిళ వేచి ఉండగా దుండగలు ఆమెను రైల్వే స్టేషన్ లోని నిర్మానుష్య   ప్రాంతానికి   తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు గుర్తించారు. రాత్రి  సమయం అవటంతో ఈ ఘటనను ఎవరూ గుర్తించలేదు. శనివారం ఉదయం అటుగా వెళుతున్న కొందరు   అపస్మారక  స్ధితిలో పడి ఉన్న మహిళను…. అక్కడ  ఉన్న   పరిసరాలను  గమనించి మహిళను ఆస్పత్రికి తరలించి  పోలీసులుకు సమాచారం అందించారు.  బాధితురాలి భాష తెలియకపోవటంతో విచారణ మందకొడిగా సాగుతున్నది.