Girl Rape : కరోనా మందు పేరిట మత్తుమందు ఇచ్చి బాలికపై అత్యాచారం

కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ లో ఉంటున్న బాలికపై అత్యాచారం జరిగింది. హాస్టల్ నిర్వహకుడు విజయ్ కుమార్ కరోనా మందు పేరుతో బాలికకు మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు.

Girl Rape : కరోనా మందు పేరిట మత్తుమందు ఇచ్చి బాలికపై అత్యాచారం

Rape

girl raped : దేశంలో మహిళల రక్షణకు నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక మూలన అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళలు లైంగిక దాడులు, చిత్రహింసలకు గురవుతూనేవున్నారు. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే ఏపీలో మరో బాలికపై అత్యాచారం జరిగింది.

కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ లో ఉంటున్న బాలికపై అత్యాచారం జరిగింది. హాస్టల్ నిర్వహకుడు విజయ్ కుమార్ కరోనా మందు పేరుతో బాలికకు మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలికకు గర్భస్రావం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు గర్భస్రావం కావడం వల్ల అనుమానంతో తల్లి ప్రశ్నించగా లైంగిక దాడి జరిగిన విషయాన్ని బాలిక వివరించింది.

Hyderabad : బాలికకు మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్

కరోనా మందు పేరుతో బాలికకు మత్తు మందు ఇచ్చి దారుణానికి పాల్పడినట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చించారు. పరీక్షించిన వైద్యులు నిందితుడు అఘాయిత్యం చేయడంతో బాలిక గర్భం దాల్చిందని, అనంతరం గర్భస్రావం అయిందని నిర్ధారించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు విజయ్ కుమార్ పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం విస్త్రతంగా గాలిస్తున్నారు.