TDP Mahanadu : మహానాడుకు రండీ .. చంద్రబాబు డిజిటల్ సంతకంతో ప్రతినిధులకు ఆహ్వానం

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం రండీ అంటూ చంద్రబాబు డిజిటల్ సంతకాలతో ఆహ్వానాలను పంపిస్తున్నారు.

TDP Mahanadu : మహానాడుకు రండీ .. చంద్రబాబు డిజిటల్ సంతకంతో ప్రతినిధులకు ఆహ్వానం

Chandrababu digital signature TDP Mahanadu

Chandrababu invites to TDP Mahanadu : తెలుగుదేశం అధినేత చంద్రబాబు టీడీపీ మహానాడుకు ఆహ్వానాలు పంపుతున్నారు. చంద్రబాబు డిజిటల్ సంతకంతో ప్రతినిధుల సభకు ఆహ్వానాలు పంపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మే 27, 28 (2023)న మహానాడును ఘనంగా నిర్వహించనున్నారు. మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం రండీ అంటూ చంద్రబాబు డిజిటల్ సంతకాలతో ఆహ్వానాలను పంపిస్తున్నారు.

ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా 27న ప్రతినిధుల సభ, 28న మహానాడు భారీ బహిరంగ సభ జరగనుంది. ప్రతి యేటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ ప్రతినిధుల మహానాడును మే 27న జరుపుకోవటం మన సంప్రదాయం. వేమగిరిలో నిర్వహిస్తున్న మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం అంటూ ప్రతినిథులకు పంపించే ఆహ్వానాల్లో పేర్కొన్నారు. మే 28న భారీ బహిరంగ సభ జరుగుతుంది.  ఈ మహానాడులో మీరందరూ భాగస్వాములు కావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటిచెప్పారని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు నాంది పలికారని కీర్తించారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి (మే 28) రోజు మహానాడు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని వెల్లడించారు. రాజమండ్రి మహానాడులో అన్ని అంశాలపై చర్చలు ఉంటాయని..రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక నిర్ణయాలపై చర్చ చేపడతామని పేర్కొన్నారు. మే 28న భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. కాగా.. ఈ సమావేశాలకు 15 వేల మందికి పైగా వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో, మహానాడు ప్రతినిధుల సభకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన డిజిటల్ సంతకంతో ఆహ్వానాలు పంపుతున్నారు.