తిరుపతికి పవన్ కళ్యాణ్.. ఉపఎన్నిక సీటుపై క్లారిటీ వస్తుందా?

తిరుపతికి పవన్ కళ్యాణ్.. ఉపఎన్నిక సీటుపై క్లారిటీ వస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఉపఎన్నికల హడావుడి అప్పుడే కనిపిస్తోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 21వ తేదీన తిరుపతిలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 21న సాయంత్రం తిరుపతి నగరంలో నిర్వహించనున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC)లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.