Karthika Parva Deepotsavam : నవంబరు 18న తిరుమలలో కార్తీక పర్వదీపోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 18వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరుగుతుంది.
Karthika Parva Deepotsavam : తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 18వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరుగుతుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత టీటీడీ ఈ దీపోత్సవం నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా సాయంత్రం గం.5 నుండి రాత్రి గం.8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయం, ఉప ఆలయాల్లో దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.
Also Read : Karthika Pournami 2021 : ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి