Kolagatla Veerabhadra Swamy : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. దాంతో, ఉప సభాపతి పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ బలాబలాల రిత్యా ఈ పదవికి టీడీపీ పోటీ చేయలేదు.

Kolagatla Veerabhadra Swamy : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

Kolagatla Veerabhadra Swamy : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. దాంతో, ఉప సభాపతి పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ బలాబలాల రిత్యా ఈ పదవికి టీడీపీ పోటీ చేయలేదు.

ఈ నేపథ్యంలో, నేడు ఎన్నిక ఫలితాన్ని అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. కోలగట్లను సీఎం జగన్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష సభ్యులు కూడా నూతన డిప్యూటీ స్పీకర్ కు అభినందనలు తెలిపారు.

తాజాగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఒకే ప్రాంతానికి(ఉత్తరాంధ్ర) చెందిన వారినే నియమించడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధినేత జగన్ సూచనల మేరకు డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో కోలగట్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి.. అసెంబ్లీ సెషన్ తొలి రోజే పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన స్ధానంలో కోలగట్లకు అవకాశం లభించింది.

విపక్ష టీడీపీ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో కోలగట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తనను డిప్యూటీ స్పీకర్ స్ధానంలో కూర్చోబెట్టినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు కోలగట్ల వీరభద్రస్వామి.

ప్రస్తుతం టీవీలు, ఇతర మాధ్యమాల ద్వారా సభా కార్యక్రమాలను ప్రజలు గమనిస్తుంటారని.. సభ పట్ల, సభ్యుల పట్ల గౌరవం పెంపొందించుకునే విధంగా అందరూ పనిచేయాలని కోలగట్ల కోరారు. సభలో చర్చలు అర్ధవంతంగా సాగేందుకు సభ్యులు సహకరించాలని, సభ్యులు వివిధ అంశాలపై పూర్తి అవగాహనతో రావాలని సూచించారు.

డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామిని కూర్చోబెట్టడం సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేయడం, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.

పదవుల పంపకంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. గతంలో బ్రాహ్మణ వర్గానికి(కోన రఘుపతి) డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఇప్పుడు వైశ్య సామాజికవర్గానికి చెందిన కోలగట్లకు పదవి ఇచ్చినట్లు సమాచారం.