సాల్వెంట్స్ కంపెనీలో ప్రమాదం..శ్రీనివాసరావు మృతి..? ధృవీకరించని అధికారులు

  • Published By: madhu ,Published On : July 14, 2020 / 09:18 AM IST
సాల్వెంట్స్ కంపెనీలో ప్రమాదం..శ్రీనివాసరావు మృతి..? ధృవీకరించని అధికారులు

విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకరు చనిపోయారు. 2020, జులై 14వ తేదీ సోమవారం శిథిలాల కింద ఒకరి డెడ్ బాడీ కనిపించింది. అనాకపల్లి మండలం రేపాకకు చెందిన శ్రీనివాస్ గా భావిస్తున్నారు. కానీ దీనిని అధికారులు కన్ఫమ్ చేయడం లేదు. తొలుత కంపెనీలో నలుగురు మాత్రమే పనిచేస్తున్నారని వెల్లడించారు. కానీ ఐదుగురు వ్యక్తులు లోపల ఉన్నట్లు భావిస్తున్నారు.

2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. 12 ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పాయి. అధికారులు, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.

రాత్రి విధులకు వచ్చిన శ్రీనివాసరావు ఆచూకి తెలియడం లేదని, ఇతని సమాచారం చెప్పాలని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్డీవో కు సమాచారం ఇచ్చారు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని అధికారులు నచ్చచెప్పి వారిని పంపించారు. మరి చనిపోయింది శ్రీనివాసరావా ? లేక ఎవరనేది తెలియాల్సి ఉంది.