Roja Selvamani : చంద్రబాబు, లోకేశ్‎పై సీబీఐ విచారణ జరిపి జైలుకి పంపాలి- మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

భార్యను చూసుకోలేనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? దేశం నుంచే మోదీని తరిమికొట్టాలి అన్నోడు ఈరోజు..Minister Roja Selvamani

Roja Selvamani : చంద్రబాబు, లోకేశ్‎పై సీబీఐ విచారణ జరిపి జైలుకి పంపాలి- మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Minister Roja Selvamani

Minister Roja Selvamani : ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలకు ప్రసంగాలు చేసే పవన్ కల్యాణ్.. చంద్రబాబుకి ఐటీ నోటీసులపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. గతంలో మోదీని తిట్టిపోసిన చంద్రబాబు, ఇప్పుడు మాత్రం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి రోజా సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు ఐటీ నోటీసులపై తీవ్రంగా స్పందించారు.

”ఊరూరా తిరిగిన నారా లోకేశ్ వాళ్లు దోచుకున్నారు వీళ్లు దోచుకున్నారు అని ఎమ్మెల్యేల గురించి తప్పుడు ప్రచారం చేశారు. షూటింగ్ గ్యాప్స్ లో చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకుని పవన్ కల్యాణ్ ఏ విధంగా ఊగిపోతూ, మాపై విమర్శలు చేస్తున్నాడో తెలిసిందే. మరిప్పుడు చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడం లేదు? ఐటీని నేనే కనిపెట్టాను అన్న పెద్ద మనిషి.. ఇవాళ ఐటీ ఇచ్చిన నోటీసులపై ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు, లోకేశ్ మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలి.

Also Read..Kodali Nani: చంద్రబాబు అన్ని రూ.కోట్లు ఇలా సంపాదించారు: కొడాలి నాని

ఈడీ కూడా ఎంక్వైరీ చేసి వీళ్లందరినీ తీసుకెళ్లి లోపల వేయాలి. మోదీ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తోంది అని చంద్రబాబు అంటున్నారు. గతంలో ఇదే చంద్రబాబు ఏమన్నారు? భార్యను చూసుకోలేనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? దేశం నుంచే మోదీని తరిమికొట్టాలి అన్నోడు ఈరోజు మోదీ కాళ్లు పట్టుకోవాలని, అమిత్ షా కాళ్లు పట్టుకోవాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు?” అని రోజా ఫైర్ అయ్యారు.