Biswajit Das Gupta : కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలు జరపట్లేదు : నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా

కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలు జరపడం లేదని నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా అన్నారు. ఎక్కువ మాస్ క్రౌడింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Biswajit Das Gupta : కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలు జరపట్లేదు : నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా

Biswajit Das Gupta

Navy Day celebrations : కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలు జరపడం లేదని నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా అన్నారు. ఎక్కువ మాస్ క్రౌడింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. వాతావరణం అనుకూలిస్తే సముద్ర తీరంలో నౌకలు ప్రదర్శిస్తామని చెప్పారు.

తూర్పు నావికా దళ ఆధ్వర్యంలో రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2022 ఫిబ్రవరి 21 న ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ, 25వ తేదీన మిలాన్ 2022 కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా మూడో సారి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.  వరదలు తుఫాన్ల సమయంలో సహాయక చర్యల్లో నేవీ ముందుంటుందని చెప్పారు.

Satyakumar : ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది : బీజేపీ నేత సత్యకుమార్

కోస్టల్ సెక్యూరిటీ చాల కీలకమైందన్నారు. కోస్ట్ గార్డు నేవీ నిరంతరం నిఘా చేస్తూనేవుందని పేర్కొన్నారు. ఇందులో 47 దేశాలు పాల్గొంటాయని తెలిపారు. చైనా, పాకిస్థాన్ లను ఆహ్వానించండం లేదని వెల్లడించారు.