JC Asmith Reddy: మా లక్ష్యం ఒక్కటే చంద్రబాబుని మరో సారి ముఖ్యమంత్రిని చేయడం: జేసి అస్మిత్ రెడ్డి

చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని.. లక్ష్య సాధనలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బాధపడబోమని అస్మిత్ రెడ్డి అన్నారు

JC Asmith Reddy: మా లక్ష్యం ఒక్కటే చంద్రబాబుని మరో సారి ముఖ్యమంత్రిని చేయడం: జేసి అస్మిత్ రెడ్డి

Asmith

JC Asmith Reddy: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని.. లక్ష్య సాధనలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బాధపడబోమని అస్మిత్ రెడ్డి అన్నారు. కాగా రానున్న ఎన్నికల్లో పుట్టపర్తి టికెట్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి కేటాయిస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయమని ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈక్రమంలో తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అస్మిత్ రెడ్డి స్పందించారు. బుధవారం పుట్టపర్తిలో అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ..జేసి ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి మీద దృష్టి సారించారనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

Also read:Botsa On Chandrababu : టీడీపీ ఇక అధికారంలోకి రాదు, సొంత కొడుకు ఎందుకు ఓడిపోయాడు?- మంత్రి బొత్స

“మా లక్ష్యం ఒక్కటే చంద్రబాబుని మరో సారి ముఖ్యమంత్రిని చేయడం..లక్ష్య సాదనలో ఎవరికి టికెట్ వచ్చినా రాకున్నా బాదపడేది లేదు” అంటూ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పల్లె రఘునాథ రెడ్డి స్పందిస్తూ..ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఇక రఘునాథ రెడ్డి వ్యాఖ్యలపైనా అస్మిత్ రెడ్డి స్పందిస్తూ పల్లె రఘునాథ్ రెడ్డి గురించి మాట్లాడే అంత వయసు నాకు లేదని అన్నారు. తాడిపత్రిలోనూ తాన్ కుమారుడు అస్మిత్ రెడ్డి కంటే మంచి వ్యక్తి ఉంటే.. అతనికే పార్టీ టికెట్ కేటాయిస్తే తన మద్దతు ఉంటుందుని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రిలో మాకన్న కష్టపడేవారు ముందుకొస్తే స్వచ్చందంగా టికెట్ వదులుకుంటామని అన్నారు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే చంద్రబాబు విజన్ ని మెచ్చుకున్న ఏకైక నాయకుడు జేసి ప్రభాకర్ రెడ్డి అని అస్మిత్ రెడ్డి అన్నారు.

Also read:Devineni Uma: మైలవరాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలంటూ రోడ్డుపై భైఠాయించిన దేవినేని ఉమా