Pawan Kalyan Slams Government : వైసీపీ మళ్లీ వస్తే అంధకారమే-పవన్ కళ్యాణ్
రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని అన్నారు. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు.
Pawan Kalyan Slams Government : జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పవన్ ముందుకు సాగుతున్నారు. ఛాన్స్ చిక్కిత చాలు జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడానికి వీల్లేదని పవన్ అంటున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు పవన్. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన నంద్యాలలో మాట్లాడారు. ఏపీలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ప్రత్యామ్నాయ పాలన అవసరం అని స్పష్టం చేశారు.
Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి : పవన్ కళ్యాణ్
అయితే, రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని అన్నారు. పొత్తులపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. పొత్తులను వ్యక్తిగత లాభాల కోణంలో చూడడం లేదని స్పష్టం చేశారు. 2014లో బీజేపీ, టీడీపీలతో కలిసి జనసేన పోటీ చేసిందని వెల్లడించారు. ఎప్పుడైనా సరే, పొత్తు ప్రజలకు ఉపయోగపడకపోతే జనసేన అందులోంచి బయటికి వస్తుందని తెలిపారు.
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శించి ఆర్థికసాయం చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై పవన్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తాను ప్రజల అజెండా తప్ప ఎవరి జెండాలు.. అజెండాలు మోసే వ్యక్తిని కాదని పవన్ తేల్చి చెప్పారు. తనకు ఏ పార్టీ పైనా వ్యక్తిగత ఆపేక్ష లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత క్షీణించాయని, ఆడబిడ్డల గౌరవ మర్యాదలు కాపాడమంటే అది చాలా చిన్న విషయంగా మాట్లాడతారని ప్రభుత్వ పెద్దలపై ధ్వజమెత్తారు పవన్. బిడ్డలు చేసిన తప్పులకు తల్లులే కారణమంటూ మాట్లాడడం వంటి విపరీత ధోరణులు అందరికీ బాధ కలిగించాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బలమైన ప్రత్యామ్నాయం కావాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో అన్ని పార్టీలు ఏకమై కాంగ్రెస్ కు ఎదురొడ్డి నిలిచాయని పవన్ గుర్తు చేశారు.
Chandrababu : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అస్తవ్యస్తంగా ఉన్న వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలంటే ఓటు చీలకూడదని, దీనిపై ఒక చర్చ జరగాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. కేంద్రం పెద్దలు కచ్చితంగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు.
వైసీపీ అపసవ్య పాలన వల్లే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పవన్ ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆదుకుని ఉంటే తాము భరోసాయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు పవన్. వైసీపీ పాలనలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవని విమర్శించిన జనసేనాని..ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోందన్నారు.
అవకాశం ఇవ్వండి… కోట్లమంది కన్నీరు తుడుస్తా#JanaSenaRythuBharosaYatra pic.twitter.com/jEOG0jOE2X
— JanaSena Party (@JanaSenaParty) May 8, 2022