Andhra pradesh: పేకాట ఆడుతూ చిక్కిన 10 మంది.. వారిలో ఇద్దరు పోలీసులు
మొత్తం 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 79,540 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ నిర్వాహకుడు శివ నాగిరెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదు అయినట్లు సమాచారం.
Andhra pradesh: పేకాట ఆడకుండా చూడాల్సిన వారే స్వయంగా ఆడారు. పేకాటరాయుళ్ళతో కూర్చొని ఇద్దరు పోలీసులు ఎంచక్కా పేకాట ఆడుతూ, గ్యాంబ్లింగ్ను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లెలో చోటు చేసుకుంది. పేకాట ఆడుతూ దొరికిపోయారు ఇద్దరు పోలీసులు. బనగానపల్లెలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసుల దాడి చేయగా వారి చేతికి 10 మంది చిక్కారు. వీరిలోనే ఇద్దరు పోలీసులు ఉన్నారు.
corona: దేశంలో 1,50,100కు చేరిన కరోనా యాక్టివ్ కేసులు
వారే నందివర్గం ఏఎస్సై యువరాజ్, కొలిమిగుండ్ల హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు. మొత్తం 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 79,540 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ నిర్వాహకుడు శివ నాగిరెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదు అయినట్లు సమాచారం.