Cheddi Gang : చెడ్డీగ్యాంగ్ వేటలో తాడేపల్లి పోలీసులు
చెడ్డీ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిధ్ధమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రెయిన్బో విల్లాస్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో దోపిడీకి ప్రయత్నం చేస
Cheddi Gang : చెడ్డీ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిధ్ధమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రెయిన్బో విల్లాస్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో దోపిడీకి ప్రయత్నం చేసిన చెడ్డీ గ్యాంగ్ పని పట్టేందుకు విచారణ వేగవంతం చేసిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న నివాస గృహాలను పూర్తి స్థాయిలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇళ్ళలో సీసీ టీవీ కెమెరాలు పెట్టుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజిలో లభించిన ఆధారాలతో పాత నేరస్థులు ఫోటోలను పరిశీలిస్తున్నారు. మరోవైపు తాడేపల్లి పోలీస్ స్టేషను పరిధిలోని పాత నేరస్థులను పోలీసులు విచారిస్తున్నారు.
Also Read : Two Marriages : రెండు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు
అపార్ట్మెంట్ వాసులను అప్రమత్తం చేస్తున్న తాడేపల్లి పోలీసులు….ఎవరిపైన అయినా అనుమానం ఉంటే వేంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కేసుతో పాటువిజయవాడలో జరిగిన రెండు చోరీల కేసులపై నాలుగు ప్రత్యేక బృందాలతో చెడ్డి గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విజయవాడ, తాడేపల్లిల్లో జరిగిన దోపిడీలతో కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా… ఈ దోపిడీలు చెడ్డీ గ్యాంగ్ పనేనా… లేక స్ధానికంగా ఉన్న నేరస్ధులే చెడ్డీ గ్యాంగ్ లాగా వేషం వేసుకుని దొంగతనాలు చేస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా…గుంటూరు జిల్లా గోరంట్ల మెయిన్ రోడ్డు లోని సాయిబాబా గుడి, రామాలయం గుడి, ఆంజనేయ స్వామి దేవాలయాలలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు.తాళాలు పగలు కొట్టి దేవాలయాల్లోకి ప్రవేశించిన దుండగులు హుండీ పగలు కొట్టి నగదు తీసుకెళ్ళారు. ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.