Srikakulam : టోల్ గేట్ వద్ద ఆటోలో నుంచి ఎగిరిపడిన రూ.500 నోట్లు.. రూ.88 వేలు జల్లుకుంటూ వెళ్లిన డ్రైవర్

శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సమీపంలోని మడపాం టోల్ గేట్ వద్ద కలకలం చెలరేగింది. శనివారం అర్ధరాత్రి ఓ ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఎగిరిపడ్డాయి. సుమారు 88 వేల రూపాయలను జల్లుకుంటూ వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ ఎవరనేదానిపై పోలీసులు గాలిస్తున్నారు.

Srikakulam : టోల్ గేట్ వద్ద ఆటోలో నుంచి ఎగిరిపడిన రూ.500 నోట్లు.. రూ.88 వేలు జల్లుకుంటూ వెళ్లిన డ్రైవర్

CURRENCY

Srikakulam : శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సమీపంలోని మడపాం టోల్ గేట్ వద్ద కలకలం చెలరేగింది. శనివారం అర్ధరాత్రి ఓ ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఎగిరిపడ్డాయి. సుమారు 88 వేల రూపాయలను జల్లుకుంటూ వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ ఎవరనేదానిపై పోలీసులు గాలిస్తున్నారు.

అర్ధరాత్రి కావడం, లైటింగ్ వల్ల ఆటో నెంబర్ సీసీ కెమెరాలో రికార్డు కాలేదు. నోట్లు గాలిలో ఎగిరిపడటం గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది ఆటోను ఆపేందుకు ప్రయత్నించినా డ్రైవర్ ఆగకుండా వెళ్లి పోయాడు. వెంటనే టోట్ గేట్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Andhra Pradesh : పద్మావతి ట్రావెల్స్ బస్సులో కోట్లకు కోట్లు నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం

రోడ్డుపై పడిన నోట్లను పోలీసులకు అప్పగించారు. ఆటో డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా నోట్లను జల్లేశాడా? లేక పొరపాటున ఎగిరి పడ్డాయా అన్నది పోలీసులు విచారిస్తున్నారు. అవి దొంగనోట్లేమోననే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.