TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.84కోట్ల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకేరోజు రికార్డు స్థాయిలో 84 కోట్ల రూపాయల విరాళం వచ్చింది.

TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.84కోట్ల విరాళం

Ttd (2)

TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకేరోజు రికార్డు స్థాయిలో 84 కోట్ల రూపాయల విరాళం వచ్చింది. తిరుపతిలో చిన్న పిల్లల కార్డియాలజీ ఆసుపత్రి నిర్మాణానికి 84 కోట్ల రూపాయలు విరాళాన్ని సమర్పించారు దాతలు. కోటి రూపాయలకుపైగా విరాళం ఇచ్చిన దాతలకు ఉదయాస్తమాన సేవలు కేటాయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మొత్తం 531 ఉదయాస్తమాన సేవ టికెట్లలో శుక్రవారపు సేవకు 29 టికెట్లు కేటాయించారు. శుక్రవారం ఉదయాస్తమాన సేవ టికెట్లను కోటిన్నర రూపాయలు విరాళాలు ఇచ్చిన దాతలకు అందజేశారు. కేవలం గంటన్నరలో 29 శుక్రవారం ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కొనుగోలు చేశారు భక్తులు.

మరో 42 ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కోటి రూపాయలు చొప్పున విరాళం చెల్లించి కొనుగోలు చేశారు భక్తులు. ఉదయాస్తమాన సేవలు విక్రయం ద్వారా మొత్తం 550 కోట్లు రూపాయల విరాళాలు వస్తాయని భావిస్తోంది టీటీడీ.

ఇక టీటీడీకి గురువారం(17 ఫిబ్రవరి 2022) 9 కోట్ల 20 లక్షల రూపాయల విరాళం అందించారు ఓ భక్తురాలు. స్వర్గీయ డాక్టర్ ఆర్ పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి శ్రీమతి రేవతి విశ్వనాథం శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆస్తులకు సంబంధించిన పత్రాలను అందజేశారు.