Stone Pelting Vande Bharat Train : విశాఖలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి

ఏపీలో వెర్షన్-2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. విశాఖ కంచరపాలెంలో రామ్మూర్తిదంపతులుపేట వద్ద నిలిపి ఉంచిన రైలుపై ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు.

Stone Pelting Vande Bharat Train : విశాఖలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి

VANDEBHARAT

Stone Pelting Vande Bharat Train : ఏపీలో వెర్షన్-2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. విశాఖ కంచరపాలెంలో రామ్మూర్తిదంపతులుపేట వద్ద నిలిపి ఉంచిన రైలుపై ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు. ఎక్స్ ప్రెస్ కోచ్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నాయి. రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఇది గమనించిన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రైలుపై రాళ్ల దాడికి పాల్పడిన ఆకతాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  రాళ్ల దాడిని వాల్తేరు డివిజన్ అధికారులు ధృవీకరించారు.

Express Trains Speed Increased : ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెంపు.. రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

ట్రయల్ రన్ లో భాగంగా వందే భారత్ రైలు విశాఖకు వచ్చింది. రైలు చెన్నై నుంచి విశాఖకు వచ్చింది. ఈ నెల 19న వెర్షన్-2 వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖ మధ్య నడవనుంది.