School Building : తీవ్ర విషాదం.. ఆడుకోవడానికి స్కూల్‌కి వెళ్లిన విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాల పైకప్పు విద్యార్థి ప్రాణం తీసింది. ఆదివారం(ఆగస్టు 29,2021) సెలవు రోజు కావడంతో పలువురు పిల్లలు

School Building : తీవ్ర విషాదం.. ఆడుకోవడానికి స్కూల్‌కి వెళ్లిన విద్యార్థి మృతి

School Building

School Building : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాల పైకప్పు విద్యార్థి ప్రాణం తీసింది. ఆదివారం(ఆగస్టు 29,2021) సెలవు రోజు కావడంతో పలువురు పిల్లలు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆడుకోవడానికి వెళ్లారు. అంతా ఆనందంగా ఆడుకుంటున్నారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగింది. ఒక్కసారిగా భవనం పైకప్పు కూలింది. అక్కడే ఉన్న విష్ణు అనే విద్యార్థి శిథిలాల కింద చిక్కుకుని చనిపోయాడు. విష్ణు ప్రైవేట్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు.

సెలవు రోజుల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన తోటి పిల్లలంతా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ ఉంటారు. ఆదివారం కూడా అలానే పిల్లలు స్కూల్ కి వెళ్లారు. అదే సమయంలో పైకప్పు కూలి ఓ విద్యార్థి ప్రాణం పోయింది. చుట్టుపక్కల ఆడుకుంటున్న పిల్లలు, పెద్దలు వచ్చి గమనించేలోగా తీవ్ర గాయాలతో విష్ణు కన్నుమూశాడు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆడుకోవడానికి వెళ్లిన విష్ణు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కొడుకు ఇక లేడు అనే వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. అంతేకాదు ఆందోళనకు గురి చేసింది. ఒకవేళ స్కూల్ జరిగే సమయంలో పైకప్పు కూలి ఉంటే ఊహకు అందని రీతిలో ఘోరం జరిగి ఉండేదన్నారు.