Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు
ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక సంఘటనలు జరగటం దురదృష్టకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandra Babu Naidu
Konaseema Tension : ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక సంఘటనలు జరగటం దురదృష్టకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి టీడీపీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల, ప్రభుత్వ వైఫల్యం అని చంద్రబాబు ఆరోపించారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు కోరారు.