Chandrababu: వారికి హ్యాట్సాఫ్.. మీరూ కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు -చంద్రబాబు

పకడ్బంధీగా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలిచే పరిస్థితి ఉండదని, అందుకే ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.

Chandrababu: వారికి హ్యాట్సాఫ్.. మీరూ కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు -చంద్రబాబు

Chandrababu

Chandrababu: పకడ్బంధీగా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలిచే పరిస్థితి ఉండదని, అందుకే ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరు అధికారుల్ని ముందుగా ప్రభుత్వం నియమించిందని చంద్రబాబు విమర్శించారు.

జగన్ రెడ్డి చెప్పిందల్లా చేద్దామనుకుంటే తమ అంతం ప్రారంభమవుతుందని అధికారులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు చంద్రబాబు. ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు ఇష్టం వచ్చినట్లు చేద్దాం అనుకుంటే ఊరుకునేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

కోర్టులు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు చంద్రబాబు. అధికారులు ప్రభుత్వం చేసే అడ్డగోలు పనులకు సహకరించకుండా.. తాము ఐఏఎస్ అధికారులమనే విషయాన్ని కొందరు గుర్తుంచుకోవాలని అన్నారు చంద్రబాబు. కొంతమంది అధికారులు మాత్రం ప్రభుత్వం చెప్పే అడ్డగోలు పనులు చేయమని చెప్పేస్తున్నారని అన్నారు. నిజాయితీగా ఉండే అధికారులకు హ్యాట్సాఫ్ అన్నారు.

ప్రభుత్వం చెప్పే తప్పుడు పనులు చేసి అధికారులు కూడా కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు చంద్రబాబు. చిన్నపాటి విమర్శలు వచ్చినా అధికారులు రాజీనామాలు చేసిన ఘటనలు ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎన్ని తిట్టినా చలనం లేదని, ఎన్నికల్లో అక్రమాలు ఎందుకు చేస్తున్నారు అని నిలదీశారు. అంత సరదాగా ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రండి.. తేల్చుకుందాం.. అని సవాలు విసిరారు.