Nara Lokesh : చీరలు కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతకాని వాళ్లా? మంత్రి రోజాను టార్గెట్ చేసిన లోకేశ్

చీరలు కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతకాని వాళ్లా? అని మంత్రి రోజాను ప్రశ్నించారు నారా లోకేశ్. ఆ మంత్రి ఓ మహిళ అయ్యుండి కూడా మహిళలను తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు.

Nara Lokesh : చీరలు కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతకాని వాళ్లా? మంత్రి రోజాను టార్గెట్ చేసిన లోకేశ్

Nara Lokesh : ఏపీ పాలిటిక్స్ లో డైమాండ్ డైలాగ్ మార్మోగుతోంది. శ్రీకాకుళం సభలో పవన్ కల్యాణ్ మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ డైమండ్ రాణి అంటే.. కుప్పం సభలో అదే డైలాగ్ వదిలారు నారా లోకేశ్. తనకు చీర, గాజులను పంపిస్తానని రోజా అంటున్నారని.. పంపిస్తే తన అక్కా, చెల్లెళ్లకు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటానన్నారు.

కుప్పంలో యువగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడారు. తనకు చీరలు, గాజులు పంపుతానని ఓ మహిళా మంత్రి అన్నారని మంత్రి రోజా పేరు ప్రస్తావించకుండానే ఫైర్ అయ్యారు. చీరలు కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతకాని వాళ్లా? అని మంత్రి రోజాను ప్రశ్నించారు నారా లోకేశ్. ఆ మంత్రి ఓ మహిళ అయ్యుండి కూడా మహిళలను తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు.

Also Read..Nara Lokesh padayatra : నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం.. భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు

”ఆ చీర, గాజులు పంపించండి. వాటిని మా అక్కచెల్లెళ్లకు ఇచ్చి, వాళ్ల కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాను” అని లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకానీ, మీ నాయకుడిలా తల్లీ, చెల్లిని మెడబట్టి బయటకు గెంటను అని విమర్శించారు. మంత్రి పదవిలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని హితవు పలికారు నారా లోకేశ్.

సీఎం జగన్ పాలనపైనా నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడని మండిపడ్డారు. యువత, రైతులు.. ఇలా అన్ని వర్గాల వారు ఈ ప్రభుత్వ బాధితులేనని అన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. మూడు రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుకైనా వేశారా? అని నిలదీశారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, ఉద్యమిస్తే జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి కాదు జాదూరెడ్డి.. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మహిళల డబ్బు లాక్కున్నాడు అని ధ్వజమెత్తారు నారా లోకేశ్.

Also Read..TarakaRathna : నటుడు తారకరత్నకు అస్వస్థత.. కుప్పం ఆసుపత్రిలో చికిత్స..

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి లోకేశ్ ఉత్సాహంగా ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పాలన, మంత్రుల తీరుపై నిప్పులు చెరిగారు లోకేశ్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.