Chandrababu : అమర జవాన్ సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి : చంద్రబాబు

ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు లేఖ రాశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

Chandrababu : అమర జవాన్ సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి : చంద్రబాబు

Chandrababu (1)

Chandrababu letter to CS Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు లేఖ రాశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. సాయితేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. గిరిజన కుటుంబంలో పుట్టిన సాయితేజ అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు. కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే స్థాయికి చేరడం వెనుక అతని కృషి, పట్టుదల, కష్టం నేటి యువతకు ఆదర్శనీయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలన్నారు.

తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన 13మందిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ్‌ కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ్‌ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆర్మీ అధికారులు సాయితేజ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో.. ఆయన స్వస్థలం ఎగువ రేగడ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

Bipin Rawat : రావత్ దంపతులకు భారతావని కన్నీటి వీడ్కోలు

సిద్ధారెడ్డి పల్లికి చెందిన శ్యామలతో సాయితేజ్​కు 2015లో వివాహం అయింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ(4), కూతురు దర్శిని(2) ఉన్నారు. వీరి కుటుంబం మదనపల్లె ఎస్​బీఐ కాలనీలో ఏడాది కాలంగా నివాసం ఉంటోంది. 2013లో సాయితేజ్ ఆర్మీలో జవానుగా చేరారు. ఏడాది తర్వాత పారా కమెండో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. స్పెషల్ ఫోర్సెస్​ 11 పారా విభాగంలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు.

బెంగళూరులో సైనికులకు శిక్షకుడిగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, సాయితేజ్ తమ్ముడు కూడా ఆర్మీలోనే సేవలందిస్తున్నారు. సాయితేజ్ మహేష్ బాబు సిక్కింలో ఆర్మీ విధులు నిర్వహిస్తున్నారు.