Andha Pradesh : వైసీపీ నాయకులకు టీడీపీ అధికారంలోకి వచ్చాక చక్రవడ్డితో కలిపి ఇచ్చేస్తాం : అచ్చెన్నాయుడు

165 స్దానాల్లో గెలిచి చంద్రబాబును సిఎంగా చేద్దామని .. వైనాట్ 175 అంటూ భీరాలు పోయే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Andha Pradesh : వైసీపీ నాయకులకు టీడీపీ అధికారంలోకి వచ్చాక చక్రవడ్డితో కలిపి ఇచ్చేస్తాం : అచ్చెన్నాయుడు

Acchannaidu

Andha Pradesh : కడపలో టీడీపీ జోన్ ఐదు జిల్లాల సమీక్ష సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు వైసీపీ ప్రభుత్వంపై వివర్శలు నేతలపై సెటైర్లు వేశారు.అరాచకాలకు, వేధింపులకు పాల్పడిన వైసీపీ నాయకులకు మేము అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాకా మొదటి అరు నెలలు ఇదే మనకు పనిగా ఉంటుందని..ఇప్పుడే గ్రామాల వారిగా లిస్ట్ తయారు చేసుకొండి అంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు అచ్చెన్నాయుడు.

టీడీపీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న పార్టీ అని అటువంటి పార్టీని వైసీపీ నేతలు ఎన్నో ఇబ్బందులకు గురి చేసారని చేస్తునే ఉన్నారని కానీ కార్యకర్తల బలంతో అన్నింటిని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇప్పుడు వారికి అధికారం ఉందని కదాని గర్వంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కానీ రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల కోసమే పనిచేస్తుందని ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నేతలు పాల్పాడని అరాచాకాలకు చక్రవడ్డీతో సహా ఇచ్చేద్దామంటూ పిలుపునిచ్చారు.

టీడీపీని లేకుండా చేస్తామంటూ వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్న వైసీపీని గద్దె దించాలన్నారు.  ఒక్క అవకాశం అని ప్రజల్ని వేడుకుని అధికారంలోకి వచ్చాక ఆ ప్రజల్నే ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ విమర్శించారు అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వం కాంట్రక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా అడిగితే కేసులు పెట్టి వేధిస్తోందని టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ కార్యాలయాలను ధ్వంసం చేస్తు వైసీపీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు అచ్చెన్నాయుడు.

165 స్దానాల్లో గెలిచి చంద్రబాబును సిఎంగా చేద్దామని .. వైనాట్ 175 అంటూ భీరాలు పోయే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 165 స్దానాల్లో గెలుపొంది మన చంద్రబాబును సిఎంగా చేద్దామని చేస్తున్నాం అంటూ ధీమా వ్యక్తంచేశారు. ఎన్నో సమస్యలను..ఇబ్బందులను ఎదుర్కొంటున్న కార్యకర్తల త్యాగాలు గొప్పవని ఇదంతా కార్యకర్తల కృషే .. అంత గొప్ప కార్యకర్తలైన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. అన్నారు అచ్చెన్నాయుడు. అధికారంలో ఉన్నా లేకుండా టీడీపీ కార్యకర్తలకు అండంగా ఉందని ఉంటుందని రేపు మనం అధికారంలోకి వచ్చాక కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు. వచ్చే ఎన్నికలకు అందరు సమిష్టి కృషితో కష్టపడి పని చెయ్యమని..దుష్టులు అనేక కుట్రలు చేస్తున్నారు..చేస్తారు కూడా..కాబట్టి ప్రతీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని..ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని మీ ఓట్లు పోకుండా చూసుకోవాలని.. అచ్చెన్నాయుడు సూచించారు.

అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని చంచల్ గూడా జైలుకు వెళ్లోచ్చిన జగన్ ఎదో చేస్తానని మాయమాటలు నమ్మిప్రజలు ఓట్లేశారని ఇప్పుడు అటువంటి జగన్ పాలనలో ప్రజలు నానా పాట్లు పడుతున్నారన్నారు. పికే (రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్) మాటలు విని కొడి కత్తితో పోడిపించుకుని..చంద్రబాబు పొడిపించారని డ్రామా అడాడని జగన్ పై విరుచుకుపడ్డారు అచ్చెన్నాయుడు.సొంత బాబాయిని చంపి సిఎంగా గెలిచాడంటూ జగన్ పై సెటైర్లు వేశారు. వివేకాను చంద్రబాబు చంపించాడని నారాసుర రక్త చరిత్ర అని కరపత్రాలు వేయించాడని కానీ అదే కేసులో ఇప్పుడు నిజాలన్నీ బయటకొస్తున్నాయని మరికొన్ని రోజుల్లో ఇక ఈ కేసులో కొంతమంది జైలుకు వెళ్లటం ఖాయమన్నారు.కడప ఉక్కు దేవుడెరుగు…విశాఖ ఉక్కును అమ్మేస్తున్న గొప్ప సీఎం జగన్ అని అటువంటి వ్యక్తికి, వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇసుకాసురుడిగా మారి దోపిడీ చేసే వైసీపీ నేతలకు బుద్ధి చెప్పాలని టీడీపీ కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

పోలీసుల విచారణ వద్దు, సీబీఐ విచారణ కావాలని వివేకా హత్య జరిగినప్పుడు డిమండ్ చేసి తీరా అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరంలేదని చెప్పిన గొప్ప వైఎస్ వారసుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు.నిందితుల భార్యలతొ వివేకాకు సంబంధాలున్నాయని హత్యకు గురి అయిన వ్యక్తిమీదనే అభాండాలు వేస్తున్నారని అటువంటి వ్యక్తులు వైసీపీ నేతలు అంటూ మండిపడ్డారు. ఎంపి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ చూసి తెలుగు వాడిగా బాధపడుతున్నానంటూ ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు.