AP Government : రాజధాని పట్ల హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు

ప్రభుత్వ నిర్ణయంతో 2024 జనవరి వరకు సమయం ఉందన్న అధికారులు.. గత ప్రభుత్వం రూ.42 వేల కోట్ల పనులను గ్రౌండ్ చేసిందని అఫిడవిట్ దాఖలు చేశారు.

AP Government : రాజధాని పట్ల హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు

Ap Government (1)

AP government : అమరావతి రాజధాని పట్ల హైకోర్టు తీర్పుపై సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈనెల 3లోగా సీఆర్డీఏ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ హైకోర్టు కోరింది. గడువు ముగుస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సీఆర్డీఏ చట్టంలో పనులు పూర్తి చేసేందుకు మరో నాలుగేళ్ల సమయం పొడిగించామని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ నిర్ణయంతో 2024 జనవరి వరకు సమయం ఉందన్న అధికారులు.. గత ప్రభుత్వం రూ.42 వేల కోట్ల పనులను గ్రౌండ్ చేసిందని అఫిడవిట్ దాఖలు చేశారు. పనులు చేసేందుకు నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వం బ్యాంక్‍లు, ఆర్థికసంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చిందని.. వాటికి వడ్డీ చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లను పిలిపించి మాట్లాడామని తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్నా నిధుల కొరత ఉందన్నారు.

AP Capital : రాజధానిపై తగ్గేదే లేదన్న సీఎం జగన్.. వికేంద్రీకరణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రభుత్వానికి ప్రాధాన్యత అన్నారు. గత ప్రభుత్వం రాజధాని పరిధిలో ఎకరం రూ.4 కోట్లుగా నిర్ణయించిందని తెలిపారు. 2023 నాటికి రాజధాని అభివృద్ధి తర్వాత భూములు అమ్మాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతులకు 22,276 ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉందన్నారు.

17,357 ప్లాట్లు రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి అమ్మకాలు జరగడంతో కేసులు నమోదు అయినట్లు తెలిపారు. 1,598 ప్లాట్లపై కేసులు నమోదు అయ్యాయని, దర్యాప్తు కొనసాగుతోంది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. తీర్పుపై అప్పీల్‍కు వెళ్లాలా? లేదా? అనే అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు.