RTC Buses : వాగులో చిక్కుకున్న మూడు ఆర్టీసీ బస్సులు.. ముగ్గురు ప్రయాణికులు మృతి

కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రామాపురం వద్ద వాగులో చిక్కుకున్న 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులో చిక్కుకున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.

RTC Buses : వాగులో చిక్కుకున్న మూడు ఆర్టీసీ బస్సులు.. ముగ్గురు ప్రయాణికులు మృతి

Rtc Bus Trap

Three RTC buses trapped at stream : ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఐదు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రామాపురం వద్ద వాగులో చిక్కుకున్న 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులో చిక్కుకున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.

బస్సు పూర్తిగా మునిగిపోవడంతో ప్రాణ నష్టం జరిగింది. ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయాణికులు రెండు ఆర్టీసీ బస్సులపైకి ఎక్కారు. రెండు ఆర్టీసీ బస్సులపైకి ఎక్కిన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. రెండు బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడామని ఆర్టీసీ ఈడీ రవివర్మ తెలిపారు.

AP Cabinet : ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. పలు బిల్లులకు ఆమోదం

కడప నుంచి తిరుపతి, చెన్నై మార్గాల్లో బస్సులు నిలిపివేశారు. జిల్లాలోని రాజంపేట మండలం గుంటూరు వద్ద వరద ఉధృతికి వరద నీటిలో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. 10మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసుల గాలిస్తున్నారు.