Tirumala : అక్టోబర్ 15 నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజు నుంచి ముగింపు రోజు వరకు అష్టాదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు.
Tirumala Srivari Navaratri Brahmotsavams : తిరుమలలో అక్టోబర్ 15 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగున్నాయి. అక్టోబర్ 23 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు టీటీడీ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను విడుదల చేసింది.
నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజు నుంచి ముగింపు రోజు వరకు అష్టాదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు. ఆర్జిత బ్రహ్మోత్సవ సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు నిర్ధేశిత వాహన సేవకు అనుమతిస్తారు.
Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత, ఎందుకంటే..
అక్టోబర్ 15న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వరకు పెద్ద శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపుతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23న శ్రీవారి చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.