Vijaya Sai Reddy : వైసీపీతోనే విశాఖ అభివృద్ధి
విశాఖ జీవీఎంసీ ఉపఎన్నికల్లో 31వ వార్డు అభ్యర్థి తరఫున విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని ఆయన అన్నారు.
Vijaya Sai Reddy : విశాఖ అభివృద్ధి చెందాలంటే వైసీపీ అభ్యర్థినే గెలిపించాలని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ జీవీఎంసీ ఉపఎన్నికల్లో 31వ వార్డు అభ్యర్థి తరఫున విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 31 వార్డులో ప్రధాన సమస్యలపై దృష్టి సారించామని చెప్పారు. విశాఖలో ఉన్న 934 మురికివాడల్లో నివసించే ప్రజలకు పట్టాలిస్తామన్నారు.
Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!
పంచ గ్రామాల్లో ఉండే ప్రజలకు కూడా పట్టాలిచ్చి హక్కులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. డ్రైనేజీలకు మరమ్మత్తులు చేస్తామన్నారు. విశాఖలో ఎనిమిది కమ్యూనిటి హాల్స్ ను 40 కోట్లతో నిర్మిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. జగన్ పాలనలో బీసీ, బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేస్తున్నాం అన్నారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని ఆయన అన్నారు.
SBI Credit Card ALERT: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐపై అదనంగా రూ.99 ఫీజు
చంద్రబాబు హయాంలో అసలు జీవీఎంసీ ఎన్నికలే పెట్టలేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. అభివృద్ధి కావాలంటే వైసీపీకే ఓటు వేయాలన్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూడాలన్నారు. అన్నం పెట్టే చెయ్యి కావాలా? సున్నం కొట్టే చెయ్యి కావాలో ఓటర్లు తేల్చుకోవాలన్నారు. ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని మంత్రి అవంతి మండిపడ్డారు.