Chittoor Auto Driver Murder : ప్రియుడితో భార్యే హత్య చేయించింది.. ఆటో డ్రైవర్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

డిసెంబర్ 5న జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసును చిత్తూరు పోలీసులు చేధించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు నిర్ధారించారు. భార్య సెల్వరాణి, ఆమె ప్రియుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Chittoor Auto Driver Murder : ప్రియుడితో భార్యే హత్య చేయించింది.. ఆటో డ్రైవర్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

Chittoor Auto Driver Murder : డిసెంబర్ 5న జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసును చిత్తూరు పోలీసులు చేధించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు నిర్ధారించారు. భార్య సెల్వరాణి, ఆమె ప్రియుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read..Bride Suicide: పెళ్లికి ముందే పెళ్లికూతురు ఆత్మహత్య.. కాబోయే భర్త వేధింపులే కారణమా?

సెల్వరాణి మామూలు లేడీ కాదు, పెద్ద కిలాడీ. నాలుగేళ్ల క్రితం ఆటో డ్రైవర్ వడివేలును వివాహం చేసుకుంది సెల్వరాణి. నాలుగేళ్లు అతడితో కాపురం చేశాక ఓ ఎంబీఏ స్టూడెంట్ ను ముగ్గులోకి దింపింది. తనకు పెళ్లి కాలేదని నమ్మించి అతడితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగింది. ఎంబీఏ స్టూడెంట్ వినయ్ ని డీప్ లవ్ లోకి దింపేసింది. తనను విడిచి ఉండలేనంతగా అతడిని అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత అసలు విషయం చెప్పింది.

Also Read..Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి ఓ సైకో, వాడిని ఎన్ కౌంటర్ చెయ్యాలి- వైశాలి డిమాండ్

తనకు పెళ్లైందని, తనకు భర్త ఉన్నాడని చెప్పింది. ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే తన భర్త వడివేలును అడ్డు తొలగించాలని చెప్పింది. పూర్తిగా సెల్వరాణి ట్రాప్ లో పడిపోయిన వినయ్.. నిరంజన్, కిషోర్ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి వడివేలును మర్డర్ చేశాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ నెల 5న వడివేలు ఇంటి నుంచి మర్డర్ స్పాట్ కి వెళ్లేలా సెల్వరాణి ప్లాన్ చేసింది. ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో నిందితులు.. వడివేలును కత్తితో పొడిచి చంపేశారు. హత్య అనంతరం తన భర్తను ఎవరో చంపారంటూ దొంగ ఏడుపు ఏడ్చింది సెల్వరాణి. తమదైన శైలిలో దర్యాఫ్తు చేసిన పోలీసులు.. వడివేలును చంపించింది భార్యేనని తేల్చారు. హత్య కేసుని చేధించిన పోలీసులు సెల్వరాణి సహా వినయ్, నిరంజన్, కిషోర్ లను అరెస్ట్ చేశారు.

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో కొందరు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. పరాయి వ్యక్తి మోజులో పడి.. తమ సంసారాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త.. వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు. ఈ క్రమంలో తమ సుఖానికి అడ్డుగా ఉన్నారని భావిస్తే.. భార్యను భర్త, భర్తను భార్య చంపడానికి కూడా వెనుకాడటం లేదు. చివరికి నేరస్తులుగా మారుతున్నారు. అక్రమ సంబంధం మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నా.. అక్రమ సంబంధాల వల్ల కలిగే అనర్థాలు కళ్లారా చూస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. తమ సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి జైలు పాలవుతున్నారు.