Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి ఓ సైకో, వాడిని ఎన్ కౌంటర్ చెయ్యాలి- వైశాలి డిమాండ్

తనను కిడ్నాప్ చేసి తన పట్ల ఘోరంగా వ్యవహరించిన నవీన్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని వైశాలి డిమాండ్ చేసింది. నవీన్ రెడ్డి, అతడి మనుషులు తన ఇంట్లో అరాచకం చేశారని వైశాలి వాపోయింది.

Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి ఓ సైకో, వాడిని ఎన్ కౌంటర్ చెయ్యాలి- వైశాలి డిమాండ్

Adibatla Kidnap Case : ఆదిభట్లలో ఓ యువకుడు 100మందితో వచ్చి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమ పేరుతో నవీన్ రెడ్డి తమ కూతురిని వేధిస్తున్నాడని వైశాలి తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే, తన కొడుకుని వాడుకుని వదిలేశారని నవీన్ తల్లి ఆరోపించింది. ఇదిలా ఉంటే, మీడియా ముందుకొచ్చిన యువతి.. కిడ్నాప్ కు సంబంధించి సంచలన విషయాలు చెప్పింది. నవీన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది.

కిడ్నాప్ కు గురైన వైశాలి శనివారం మీడియా ముందుకొచ్చి తన గోడును వెళ్లబోసుకుంది. నవీన్ రెడ్డి తనను కిడ్నాప్ చేసి హింసించాడని తెలిపింది. తనను దారుణంగా కొట్టారని వాపోయింది. కారుతో తనపై కిరాతకంగా దాడి చేశారని ఆరోపించింది. నవీన్ రెడ్డితో తనకు పెళ్లి కాలేదని, ఈ విషయంలో నీన్ అబద్దాలు చెబుతున్నాడని వైశాలి అంది. నవీన్ రెడ్డి చూపించిన ఫోటోలు మార్ఫింగ్ అని వైశాలి తెలిపింది. నవీన్ రెడ్డి తమతో కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాడంది.

Also Read..Adibatla Kidnap Case : ప్రేమా లేదు పెళ్లీ లేదు, వాడసలు మనిషే కాదు, నవీన్ రెడ్డి నా కెరీర్ నాశనం చేశాడు- ఆదిభట్ల కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్

తనను కిడ్నాప్ చేసి తన పట్ల ఘోరంగా వ్యవహరించిన నవీన్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని వైశాలి డిమాండ్ చేసింది. శుక్రవారం నవీన్ రెడ్డి మనుషులు తన ఇంట్లో అరాచకం చేశారని వైశాలి వాపోయింది. తనతో పాటు తన తల్లిదండ్రులపై దాడి చేశారంది. పది మంది తనపై దాడి చేసి తనను ఎత్తుకెళ్లారని వైశాలి ఆరోపించింది.

శుక్రవారం సినీ ఫక్కీలో వైశాలిని నవీన్ కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలుగా వెళ్లి గంటల్లోనే కిడ్నాపర్ ఆటకట్టించారు. వైశాలిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

అపహరణకు గురైన దంత వైద్య విద్యార్థిని వైశాలి శనివారం సాయంత్రం మీడియా ముందుకొచ్చి అన్ని వివరాలు తెలిపింది. ‘నవీన్ రెడ్డితో నాకు పెళ్ళి కాలేదు. ఆ ఫోటోలు మార్ఫింగే. నువ్వంటే నాకిష్టం.. బాగా చూసుకుంటా అనేవాడు. నో అని చెబితే ఇంటి ముందుకొచ్చి న్యూసెన్స్‌ చేసేవాడు. కిడ్నాప్ చేసి నన్ను చిత్రహింసలకు గురిచేశాడు. కారులో నవీన్ నన్ను దారుణంగా కొట్టాడు. జుట్టుపట్టుకుని ముఖంపై దాడి చేశాడు. హెల్ప్‌ హెల్ప్‌ అని అరుస్తుంటే.. గోళ్లతో గిచ్చాడు, నోటితో కొరికాడు. నువ్వు అంటే అస్సలు ఇష్టం లేదని చెప్తున్నా వినిపించుకోలేదు’ అని వైశాలి వాపోయింది.

Also Read..Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? అసలేం జరిగింది?

‘నాకిష్టం లేదు ఎందుకు తీసుకొచ్చావ్ అని అడిగితె. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదన్నాడు. నాకు దక్కకుంటే నిన్ను ఎవరికీ దక్కనివ్వను చిత్ర హింసలకు గురిచేశాడు. నీ జీవితం ఇక్కడితో ఆగిపోతుందని బెదిరించాడు. చెప్పినట్టు వినకపోతే మా నాన్నను చంపేస్తానని బెదిరించాడు. కారులో నా కాళ్లు పట్టుకొని లాగారు. నా కెరీర్‌ను నాశనం చేశాడు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. వారికి కఠిన శిక్ష వేయాలి’ అని వైశాలి వేడుకుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

‘మాతో కలిసి నవీన్‌ బ్యాడ్మింటన్‌ ఆడేవాడు. నవీన్‌తో పరిచయం ఉంది కానీ ప్రేమ లేదు. నవీన్‌ నాకు ప్రపోజ్‌ చేస్తే నో చెప్పా. నేనంటే ఇష్టమని చెప్తే.. పేరంట్స్‌ను అడగమని చెప్పా. నన్ను వేధిస్తున్నాడని మూడు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చా. పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే నాపై దాడి జరిగేది కాదు. నవీన్‌ దొరికిపోయాడు కాబట్టి కాపాడుకునేందుకు అతని తల్లి అబద్దాలు చెబుతోంది’ అని వైశాలి ఆరోపించింది.