Nagababu: ఆత్మహత్యలు చెసుకున్న కౌలు రైతులకు జనసేన అండగా ఉంటుంది: నాగబాబు

ప్రభుత్వం నుంచి రైతులకు అరకొర సాయం మాత్రమే అందుతుందని..అందులోనూ కౌలు రైతులకు ఏ సాయం అందడంలేదని నాగబాబు అన్నారు.

Nagababu: ఆత్మహత్యలు చెసుకున్న కౌలు రైతులకు జనసేన అండగా ఉంటుంది: నాగబాబు

Nagu

Nagababu : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కలుసుకున్న పవన్ కళ్యాణ్..ఆమేరకు పార్టీ తరుపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.లక్ష ఆర్ధిక సహాయం అందించారు. జిల్లాలోని దర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అబిమానులు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గొట్లూరు గ్రామంలో ఆత్మహత్యచేసుకున్న కౌలు రైతు కుటుబ సభ్యులను పరామర్శించారు పవన్ కళ్యాణ్. రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి క్షేమ సమాచారాలు తెలుకున్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలని వారికి అండగా జనసేన ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందని పక్షంలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోనేందుకు జనసేన ముందుకు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Also read:Tirupati : భక్తులతో నిండిపోయిన బస్టాండు..అలిపిరి వద్ద ట్రాఫిక్ జాం

ఇక అనంత పర్యటనలో జనసేనానితో పాటు..జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకుడు నాగబాబు కూడా రైతుల కుటుంబాలను పరామర్శించారు. ఈసందర్భంగా నాగబాబు ప్రత్యేకించి 10టీవీతో మాట్లాడుతూ..రాష్ట్ర వ్యప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు భరోసా కల్పించటానికే పవన్ కళ్యాణ్ ఈయాత్ర చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం నుంచి రైతులకు అరకొర సాయం మాత్రమే అందుతుందని..అందులోనూ కౌలు రైతులకు ఏ సాయం అందడంలేదని నాగబాబు అన్నారు. రాష్ట్ర వ్యప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న1000 మంది కౌలు రైతులను గుర్తించామన్న నాగబాబు..జనసేన పార్టీ తరుపున దాదాపు 300 మంది కైలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చెసుకున్న కౌలు రైతులకు జనసేన పార్టీ తరుపున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రు.5 కోట్లు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు నాగబాబు వివరించారు.

Also read:Andhra Pradesh : వైసీపీలో కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం