YSR Pension Kanuka : వృద్ధాప్య పెన్షన్ పెరిగింది..సీఎం జగన్ కీలక నిర్ణయం

జనవరి నుంచి వృద్ధాప్య పింఛన్లను పెంచారు. ఏపీలో ప్రస్తుతం 61 లక్షలకు పైగా పెన్షన్‌దారులున్నారు. వీరికి వచ్చే ఏడాది...

YSR Pension Kanuka : వృద్ధాప్య పెన్షన్ పెరిగింది..సీఎం జగన్ కీలక నిర్ణయం

Jagan Pension

YSR Pension Kanuka : కొత్త ఏడాదిలో పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం ఉన్న 2 వేల 250 రూపాయల వృద్ధాప్య పెన్షన్‌ను 2 వేల 500లకు పెంచారు. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్‌ అమలు కానుంది. స్పందన కార్యక్రమంలో ఈ విషయాన్ని సీఎం జగన్ వెల్లడించారు. గతంలో దశలవారీగా పెన్షన్లను పెంచుతామని జగన్‌ హామీ ఇచ్చారు. అందులో భాగంగా జనవరి నుంచి వృద్ధాప్య పింఛన్లను పెంచారు. ఏపీలో ప్రస్తుతం 61 లక్షలకు పైగా పెన్షన్‌దారులున్నారు. వీరికి వచ్చే ఏడాది జనవరి నుంచి 2 వేల 500 రూపాయల పెన్షన్‌ అందనుంది.

Read More : PM Modi: సౌత్ ఎంపీలతో పీఎం మోదీ సమావేశం

అలాగే మధ్యతరగతి ప్రజల కోసం జగనన్న స్మార్ట్ టౌన్‌ షిప్స్‌ పథకం తీసుకొచ్చామన్నారు ముఖ్యమంత్రి. వివాదాల్లేని ప్లాట్లను సరసమైన ధరలకే ప్రజలకు అందిస్తామన్నారు. ఆ లే అవుట్లలో అన్నిరకాల సదుపాయాలను కల్పిస్తామన్నారు . హైకోర్టులో అడ్డంకులు తొలగిపోవడంతో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు సీఎం జగన్. మంజూరు చేసిన ప్రతి ఇంటి నిర్మాణం కొనసాగేలా చూడాలన్నారు.

Read More : Anchor Ravi : ట్రోల్ చేసే వారిపై పోలీసులకి ఫిర్యాదు చేసిన యాంకర్ రవి

జనవరి 9న ప్రారంభించనున్న ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణాల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న నిరుపేద మహిళలకు.. మూడేళ్లలో 45 వేల రూపాయలను ఇవ్వనున్నారు. జనవరిలోనే రైతు భరోసా ఇస్తామని స్పందన కార్యక్రమంలో జగన్‌ వెల్లడించారు. అటు వివిధ పథకాలకు అర్హత ఉండి లబ్దిపొందలేని వారి కోసం ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి అవకాశం కల్పిస్తుందన్నారు సీఎం జగన్.