Home » Author »naveen
పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు తెలంగాణలో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను హెచ్చరించాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో.. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థలకు చెందిన కార్యకర్తలపై దాడు�
విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కార్లపై దాడి జరిగింది. మంత్రులు రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్డారెడ్డి కార్లపై దాడి జరిగింది.
మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రవికుమార్ దంపతులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న కిలో 410 గ్రాముల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పసిడి విలువ రూ.74లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 863 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 189 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 563గా ఉంది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఊరటనిచ్చే కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.
మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలు రానున్నాయన్న జగన్.. ఇవాళ్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అంతా కలిసికట్టుగా ఒకటి కావాలన్న జగన్, అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తామన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి గద్దర్ ఝలక్ ఇచ్చారు. ఇప్పటివరకు గద్దర్ నామినేషన్ వేయలేదు. రేపటితో(అక్టోబర్ 14) మునుగోడు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.
వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. దసరా ముందు రోజు కోడి (చికెన్), క్వార్టర్ బాటిల్ (మద్యం) పంపిణీ ఘటనపై ఈసీ ఆయనకు నోటీసులిచ్చింది.
మాజీమంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో కొడాలి నాని వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాడని, ఎంపీ విజయసాయి రెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. కొడాలి నాని
కొడాలి నాని గతంలో హరికృష్ణను ముంచేశారని, అందుకే ఆయన తన్ని తరిమేశారని అనిత అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా కొడాలి నాని మోసం చేశాడని, అందుకే జూ.ఎన్టీఆర్.. కొడాలి నాని దూరంగా పెట్టారని అనిత అన్నారు.
నిత్యం కరవు కాటకాలతో అల్లాడే అనంతపురం జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోత వానలతో అనంతపురం అతలాకుతలం అవుతోంది. చెరువులు తెగిపోవడంతో వరద నీరు పోటెత్తింది. పలు కాలనీలు, పొంట పొలాలు నీట మునిగడంతో జనం అల్లాడిపోతున్నారు.
జనసేనాని రాష్ట్ర పర్యటనకు బస్సు సిద్ధమవుతోంది. కార్ వాన్ తరహాలో ప్రత్యేక బస్సు రెడీ చేసుకుంటున్నారు పవర్ స్టార్. బస్సులో అన్ని హంగులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుని పరిశీలించిన పవన్ కల్యాణ్ కొన్ని మార్పుల కోసం సూచనలు చేశారు.
హిందీ జాతీయ భాష కాదని, రుద్దితే ఊరుకోబోము అని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. భారత దేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదన్న కేటీఆర్.. అధికార భాషల్లో హిందీ ఒకటని గుర్తు చేశారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 779 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 132 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 536గా ఉంది.
తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షోల పేరుతో అల్లుడు, కొడుకు.. ఎన్టీఆర్ ని ఇంకా హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు.
పెట్టుబడుల పేరుతో నిందితులు రూ.900 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బును హవాలా మార్గంలో చైనా తరలిస్తున్నట్లు నిర్ధారించారు.
రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని సీఎం జగన్ చెప్పారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని, దీని వల్ల సరిపడా విద్యుత్ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.
హైదరాబాద్ పోలీస్ బాస్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. అరాచక సీఐని తప్పిస్తూ తీసుకున్న డెసిషన్ పోలీస్ శాఖను షేక్ చేస్తోంది. డిపార్ట్ మెంట్ లోని అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించింది.