Gold Price:బంగారం ప్రియులకు బిగ్ షాక్, 10 గ్రాముల ధర రూ.52వేలు

కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకా

Gold Price:బంగారం ప్రియులకు బిగ్ షాక్, 10 గ్రాముల ధర రూ.52వేలు

Gold Price:కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల మార్కెట్లు కుదేలయ్యాయి. తీవ్ర ఆర్థిక మందగమనం లాంటి పరిణామాలు ఎదురుకాబోతున్నాయి. దీంతో మదుపరులు అలర్ట్ అయ్యారు. సురక్షిత పెట్టుబడి సాధనాలపై ఫోకస్ పెట్టారు. ముందుగా అందరి చూపు బంగారంపై పడింది. ఇంకేముంది పసిడి వైపు తమ పెట్టుబడులు మరలిస్తున్నారు. దీంతో బంగారానికి అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా గోల్డ్ ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.52వేలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

గోల్డ్ పై ఇన్వెస్ట్ మెంట్ చాలా సేఫ్:
మార్కెట్ ను పరిశీలిస్తే గత రెండేళ్లుగా బంగారంపై పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని అందించింది. 2019లో బంగారం ధర 25 శాతం పెరిగింది. ఈ ఏడాదిలోనూ ఇంతవరకూ 10 శాతం పెరుగుదల కనిపించింది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలంటే బంగారమే సరైన సాధనం. ఎన్నో దేశాల్లో లాక్‌డౌన్‌ అమలవుతున్నందున సరఫరా-డిమాండ్ కుప్పకూలాయి. ఇటువంటి పరిస్థితుల్లో మదుపరులు బంగారం పెట్టుబడి సాధనాలైన ఈటీఎఫ్‌లు, డిజిటల్‌ గోల్డ్‌ (కమాడిటీ ఫ్యూచర్స్‌), గోల్డ్‌ బాండ్స్‌పై ఆసక్తి చూపే చూపుతున్నారు. చాలా మంది షేర్ మార్కెట్లు, ఇతర బాండ్ మార్కెట్ల నుంచి నిష్క్రమించి సురక్షిత పెట్టుబడి అయిన బంగారం వైపు కదులుతున్నారు.

తులం బంగారం రూ.52వేలు:
గత ఏడాది కాలంలో బంగారం ధర బాగా పెరిగింది. అయితే ఇది ఏదో ఒక సందర్భంలో ధర పతనం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఇది ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. రానున్న సంవత్సరం నాటికి బంగారం ధర 10 గ్రామలు బంగారం ధర రూ.52వేలు పలికినా ఆశ్చర్యం లేదని బులియన్ మార్కెట్ విష్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు దేశాల్లో సమీప భవిష్యత్తులో లిక్విడిటీ సమస్యలు తలెత్తటంతో పాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ద్రవ్య లోటు ప్రధాన సమస్యలుగా మారబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే బంగారానికి అనూహ్యమైన గిరాకీ లభిస్తుంది. కాబట్టి ధర పెరిగి మదుపరులు లబ్ది పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపధ్యంలో వచ్చే ఏడాది కాలంలో బంగారం ధరలు పెరిగే చాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

బంగారం ధరలు దిగొచ్చే అవకాశమూ ఉంది:
అదే సమయంలో బంగారం ధర దిగొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే కుప్పకూలిపోయాయి. ముఖ్యంగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ లు భారీగా దెబ్బతిన్నాయి. ఆయా దేశాలు బంగారం నిల్వలు భారీగా కలిగి ఉన్నాయి. కనుక ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం విక్రయించే అవకాశం లేకపోలేదని, అప్పుడు బంగారం భారీగా ధర దిగివచ్చే అవకాశం ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

పసిడికి పెట్టుబడి డిమాండ్ పెరుగుతోంది:
ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నందున ఆభరణాలు, నాణేలు, బిస్కెట్లు వంటివాటిని ఈ అక్షయ తృతీయ వేళ కొనుగోలు చేయటం సాధ్యం కాని పరిస్థితి ఉంది. కానీ బంగారానికి పెట్టుబడి డిమాండ్ మాత్రం పెరుగుతోంది. సాంకేతికంగా చూస్తే ధరలో హెచ్చుతగ్గులు అధికంగా చోటుచేసుకునే అవకాశం ఉంది. కానీ దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.44వేల కంటే పైన ఉన్నంత వరకూ ఇదింకా పెరిగే అవకాశమే ఉంటుంది. సమీప భవిష్యత్తులో రూ.47,300 లేదా 48,550 కూడా పలకవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ సంస్థ ఎస్ పీడీఆర్ గోల్డ్ హోల్డింగ్స్ దగ్గర బంగారం నిల్వలు పెరుగుతూ ఉండటం కూడా దీనికి డిమాండ్ అధికంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏప్రిల్ 22 నాటికి ఎస్ పీడీఆర్ హోల్డింగ్స్ దగ్గర 1,042.46 టన్నుల బంగారం ఉంది. కేవలం ఈ ఏప్రిల్ నెలలోనే ఈ నిల్వలు 8 శాతం పెరిగాయి. 2019 కాలంలో చూస్తే 16.7 శాతం పెరిగిన విషయం స్పష్టమవుతుంది. అందువల్ల సమీప భవిష్యత్తులో బంగారానికి అధిక పెట్టుబడి డిమాండ్ తో పాటు ధర పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.