Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ...

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

Gold Rate

Updated On : October 17, 2023 / 7:57 AM IST

Gold and Silver Rate Today 17th October 2023: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో పది రోజుల్లో పది గ్రాముల బంగారంపై సుమారు రూ.3వేలు పెరుగుదల చోటు చేసుకుంది. తాజాగా మంగళవారం బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించింది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 310, అదేవిధంగా 24క్యారెట్ల బంగారంపై రూ. 340 తగ్గింది. దీంతో మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,100కు చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,110కి చేరింది. మరోవైపు వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 500 పెరిగింది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 55,100 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 60,110 కు చేరింది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 60,260కు చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,100, కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,110 వద్ద కొనసాగుతుంది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 260, అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 280 తగ్గింది. దీంతో అక్కడ పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,300 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,330 వద్దకు చేరింది.

Gold price today

పెరిగిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 500 పెరుగుదల చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,500 కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతుంది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి రూ.74,100గా ఉంది. బెంగళూరులోనూ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అక్కడ కిలో వెండిపై రూ. 73,000 వద్ద కొనసాగుతుంది.