RBI Hikes Repo Rate: సామాన్యులకు షాక్.. మరోసారి రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ .. పెరగనున్న లోన్ ఈఎంఐలు

ఆర్‌బీఐ రెపో రేటు (పాలసీ రేట్లు)ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.25శాతం నుంచి 6.50 శాతానికి చేరుకుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో అన్ని రకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.

RBI Hikes Repo Rate: సామాన్యులకు షాక్.. మరోసారి రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ .. పెరగనున్న లోన్ ఈఎంఐలు

RBI Governor Shaktikanta Das

RBI Hikes Repo Rate: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి సామాన్యులకు షాకిచ్చింది. వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన కొద్దిరోజులకే మంగళవారం 2023 సంవత్సరానికి సంబంధించిన తొలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను బుధవారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్‌బీఐ రెపో రేటు (పాలసీ రేట్లు)ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.50 శాతానికి చేరుకుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో అన్ని రకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.

 

దేశంలో ద్రవ్యోల్బణం తగ్గిన తర్వాత కూడా రిజర్వ్ బ్యాంకు వరుసగా ఆరోసారి రెపో రేటు పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా పెంపుతో 6.25శాతంగా ఉన్న రెపో రేటు ప్రస్తుతం 6.50 శాతంకు పెరిగింది. రెపో రేటు పెంపు కారణంగా హోం లోన్స్, ఆటో, పర్సనల్ లోన్ వరకు అన్నింటికీ వడ్డీ రేట్లు పెరుగుతాయి. గతేడాది డిసెంబర్‌లో ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లను 5.90 శాతం నుంచి 6.25 శాతంకు పెంచారు. గత ఏడాది నుంచి ఆర్ బీఐ రెపో‌రేటు ఆరుసార్లు పెంచింది. మొత్తం 2.50 శాతం పెరిగింది.

 

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్వోల్బణానికి సంబంధించి తన అంచనాను కూడా వెల్లడించారు. 2024 సంవత్సరంలో ద్రవ్వోల్బణం నాలుగు శాతానికి మించి ఉంటుందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ డీజీపీ 6.4శాతానికి చేరుకోవచ్చని ఆయన చెప్పారు.