Stock Market : బ్లాక్ మండే, 19 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
ప్రపంచవ్యాప్తంగా ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంతో మదుపరులు అప్రమత్తంగా ఉన్నారు. మొత్తంగా 19 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద...

Stock Market Updates : భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. 1,545 పాయింట్ల భారీ పతనాన్ని నమోదు చేసింది సెన్సెక్స్. 468 పాయింట్లు నిఫ్టీ కోల్పోయింది. ఐదు రోజుల్లోనే 3,816 పాయింట్లను సెన్సెక్స్ కోల్పోయింది. ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో భారతీయ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంతో మదుపరులు అప్రమత్తంగా ఉన్నారు. మొత్తంగా 19 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.
Read More : Hyderabad Rci : హైద్రాబాద్ ఆర్ సీ ఐలో అప్రెంటిస్ ల భర్తీ
ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లు చుక్కలు చూపించాయి. మార్కెట్లు బ్లాక్ మండేను నమోదు చేశాయి. ఒమిక్రాన్ విస్తృతి కారణంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందనే భయాలు…మార్కెట్లను కుప్పకూల్చాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే సూచనలు కనిపించడం, దానివల్ల ఇక్కడి స్టాక్ మార్కెట్లో అమెరికా ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడులు కొంతమేరైనా వెనక్కి వెనక్కివెళ్లే అవకాశాలు ఉండటంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు మార్కెట్లను కోలుకోనివ్వడం లేదు. కీలకమైన అన్ని ప్రపంచదేశాల మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. గతవారం అమెరికా నాస్ డాక్ తీవ్ర నష్టాలతో ముగిసింది. రేపటి నుంచి అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో తీసుకునే నిర్ణయాలు మార్కెట్ల గతిని నిర్దేశించనున్నాయి.
Read More : Telangana BJP : రాజన్న పవర్ ఫుల్ దేవుడు, హామీలు నెరవేర్చకపోతే.. వాళ్ల సంగతి చూసుకుంటాడు
వడ్డీరేట్ల పెంపు తప్పదని ఇప్పటికే ఫెడ్ స్పష్టంగా చెప్పినా ఎంత వేగంగా దాన్ని అమలు చేయనుందనే విషయం కీలకం కానుంది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 2వేల 271 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా దాదాపు 7వందల పాయింట్లు నష్టపోయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మారుతి, సన్ ఫార్మా, ఎయిర్ టెల్, ICICI షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బడ్జెట్ వరకూ ఇదే ఒడిదుడుకులు ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడ్జెట్ తర్వాత మార్కెట్లు కొంత స్థిరపడొచ్చని చెబుతున్నారు.
- Sensex : స్టాక్ మార్కెట్ ఢమాల్.. భారీ నష్టాలు
- Ideas2IT : 100 మంది ఉద్యోగులకు కార్లు గిఫ్ట్
- CoCa Cola Investment: తెలంగాణలో కోకాకోలా మరో రూ.600 కోట్ల పెట్టుబడి: ప్రభుత్వంతో మూడు ఒప్పందాలు
- Petrol Prices: నిత్యం పైపైకే: 15 రోజుల్లో 13 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- Petrol Mileage Cars: ఇండియాలో 20 కేఎంపీఎల్ మైలేజ్ ఇచ్చే టాప్ పెట్రోల్ కార్లు ఇవే
1Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
2Zoom Hackers : జూమ్ యాప్తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
3Kevin Speacy : పురుషులపై లైంగిక వేధింపులు.. ఆస్కార్ అవార్డు గ్రహీతపై కేసు..
4Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..
5NTR : ఫిల్మ్నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..
6Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
7NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
8NTR : ఎన్టీఆర్ ఘాట్ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
9Virender Sehwag: “ఆ మ్యాచ్లు ఆడకపోతే పంత్ను పట్టించుకోరు”
10CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు