గుడ్ న్యూస్ : రూ. 153కే 100 పే ఛానళ్లు

  • Published By: madhu ,Published On : January 14, 2019 / 01:32 PM IST
గుడ్ న్యూస్ : రూ. 153కే 100 పే ఛానళ్లు

హైదరాబాద్ : సంక్రాంతి పండగవేళ బుల్లితెర వీక్షకులకు గుడ్ న్యూస్. ట్రాయ్ నిబంధనలతో గందరగోళమౌతున్న వారికి ఇదొక మంచి ఆఫర్ అనే చెప్పాలి. ట్రాయ్ మంచి కబురు అందించింది. ఏవైనా వంద ఉచిత ఛానళ్లు లేదంటే ప్రేక్షకులు కోరకునే 100 పే ఛానళ్లను రూ. 153కే అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అది కూడా ఫిబ్రవరి 1 నుంచే. కనెక్షన్లు..కేబులైనా..డిటిహెచ్ అయినా..తాము చెప్పినట్లుగా వంద ఛానళ్లను చెప్పిన ధరకే అందించాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31లోగా ఆపరేటర్లను వినియోగాదారులు సంప్రదించాలని కోరింది. ఏవైనా సందేహాలు కానీ ఫిర్యాదులు కానీ చేయాలంటే 011-23237922, 011-23220209 నంబర్లకు ఫోన్ చేయాలని ట్రాయ్ స్పష్టం చేసింది.
100 ఛానళ్లని రూ.153.40పైసలకు అందించాల్సిందే
అవి ఫ్రీచానళ్లు కావచ్చు..పే ఛానళ్లు కావచ్చు
ధరలో మార్పులేకుండా..ఫిబ్రవరి 1 నుంచి చెల్లించాలంటూ ట్రాయ్ ఆదేశం
ఈ నెల 31 లోపుగా వినియోగదారులు కేబుల్ ఆపరేటర్లని సంప్రదించాలి
కాల్ చేయండి 011-23237922, 011-23220209