Mahesh Bank Hacking Case : మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు.. కీలక అనుమానితురాలి ఫోన్ స్విచ్ఛాఫ్
కీలక అనుమానితురాలు షానాజ్ బేగం బషీర్బాగ్ బ్రాంచ్లో ఈ నెల 11న సేవింగ్ ఖాతా తెరిచినట్లు గుర్తించారు. బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసింది సైబర్ నేరగాళ్లే అని నిర్దారణకు వచ్చారు.
Mahesh Bank hacking case : ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం అయింది. పది పోలీస్ బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక అనుమానితురాలు షానాజ్ బేగం ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉంది. బెనిఫిషియరీ ఖాతాలుగా యాడ్ అయిన కరెంట్ అకౌంట్లకు సంబంధించి హిందుస్తాన్ ట్రేడర్స్ నిర్వాహకుడు వినోద్కుమార్, ఫార్మాహౌస్కు చెందిన సంపత్కుమార్లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
వీరి ఫోన్లను పరిశీలించగా ప్రాథమిక ఆధారాలు లభించినప్పటికీ నేరంలో పాత్రపై స్పష్టత రావాల్సివుంది. కీలక అనుమానితురాలు షానాజ్ బేగం బషీర్బాగ్ బ్రాంచ్లో ఈ నెల 11న సేవింగ్ ఖాతా తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసింది సైబర్ నేరగాళ్ల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బ్యాంకుకు మాల్వేర్ పంపడం ద్వారా సర్వర్ను యాక్సెస్ చేశారా? లేక సర్వర్లోకి ప్రవేశించిడం ద్వారా లావాదేవీలు జరిపారా? అనే దానిపై దర్యాప్తు చేపట్టారు.
Srivari Darshanam Tickets : ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల
బంజారాహిల్స్లోని సంస్థ సర్వర్ కార్యాలయానికి పోలీసులు వెళ్లారు. బ్యాంక్ అధికారులు, సర్వర్ ఐటి నిర్వాహకులను పోలీసులు ఆరా తీశారు. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక ఐటి ఎక్స్ పర్ట్స్ టీమ్ పోలీసులకు సహకారం అందించింది. బెనిఫిషియరీ ఖాతాగా జోడించిన నాలుగో ఖాతా నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హ్యాకింగ్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్లు వాడగా, వీటిలో కొన్ని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్వీ ఉన్నట్లు గుర్తించారు.
దీంతో దాని నిర్వాహకుడిని విచారించారు. తాను ఫ్రీ వైఫై సేవలు అందిస్తుంటానని, అది 24 గంటలూ ఆన్లోనే ఉంటుందని నెట్ నిర్వాహకుడు చెప్పారు. దీంతో నిర్ణీత సమయంలో ఆ వైఫైని ఎవరెవరు వాడుకున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షానాజ్ కు సైబర్ క్రైమ్ ఫోన్ చేసినప్పటి నుంచి ఆమె తన సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.
Fathered 129 Children : ఏకంగా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు
షానాజ్ పుణేలో ఎక్కువ కాలం ఉన్నట్లు గుర్తించారు. ఆమె అక్కడి నుంచి హైదరాబాద్కు పలుమార్లు రాకపోకలు సాగించినట్లు గుర్తించారు. మహేష్ బ్యాంక్ సర్వర్ నుండి 12.93 కోట్లు బదిలీ అయిన 129 ఖాతాలకు సంబంధించిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వారి కోసం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలని భావిస్తున్నారు.