Crime News: భర్త తలపై వేడినూనె పోసిన భార్య.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
భర్త వేరే మహిళతో ఉంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని భార్య తట్టుకోలేకపోయింది. కనీసం పిల్లల బాగోగులు కూడా చూసుకోకుండా బాధ్యత మరచి ప్రవర్తిస్తున్న భర్తకు పలుసార్లు నచ్చజెప్పింది. అయినా మార్పురాకపోవటంతో క్షణికావేశంతో భర్త తలపై వేడినూనె పోసింది భార్య.. తీవ్రగాయాలతో భర్త గిరిధర్ లాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Crime News: భర్త ప్రవర్తనతో భార్య విసిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా మార్పురాకపోవటంతోపాటు రోజురోజుకు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో మంగళవారం భార్యాభర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో భార్య క్షణికావేశంలో వంటింట్లో కడాయిలో వేడి నూనెను భర్త తలపై పోసింది. తీవ్రగాయాలు కావటంతో స్థానికులు, పోలీసులు అతన్ని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జియాగూడ పరిధిలోని కుల్సుంపురా ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
Crime News: హర్యానాలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి.. ఏం జరిగిందంటే..
విజయవాడ సింగినగర్ కు చెందిన గిరిధర్ లాల్, రేణుక దంపతులు పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్ నగరంలోని దరియాబాగ్ లో నివాసముంటున్నారు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడున్నరేళ్ల క్రితం నగరానికి వచ్చారు. జియాగూడ కబేళాలో పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా గిరిధర్ లాల్ మరో మహిళల మోజులో పడి ఎక్కువ సమయం అక్కడే ఉంటున్నాడని, కనీసం పిల్లల పట్ల కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడని రేణుక పోలీసుల ఎదుట వాపోయింది. ఎన్నిసార్లు చెప్పినా గిరిధర్లాల్ లో ఎలాంటి మార్పు రాకపోవడంతో భార్య,భర్తల మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
గత ఐదురోజులుగా వేరే మహిళల వద్దే ఉంటూ మూడు రోజుల క్రితమే భార్య, పిల్లల వద్దకు గిరిధర్లాల్ వచ్చాడు. ఈ క్రమంలో భార్యాభార్తల మధ్య వాగ్వివాదం కొనసాగింది. మంగళవారం మరోసారి ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకోవటంతో.. క్షణికావేశంలో రేణుక వంటింట్లోకి వెళ్లి వేడివేడిగా ఉన్న వంట నూనెను తీసుకొచ్చి భర్త తలపై పోసింది. దీంతో భర్త గిరిధర్ లాల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు, పోలీసులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రేణుకను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.