Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

ఫ్రెండ్ ను అత్యంత కిరాతకంగా చంపేశాడు. అతడి శరీర భాగాలను వేరు చేశాడు. గుండెను బయటకు తీశాడు, మర్మాంగాన్నీ కోసేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో జరిగిన ఈ దారుణ హత్య ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమించిన అమ్మాయి తనకు ఎక్కడ దూరమవుతుందోనని ఓ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.(Abdullapurmet Incident)

Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. ఇద్దరి మధ్య స్నేహం ఉంది. కట్ చేస్తే.. ఘోరాతి ఘోరం జరిగింది. ఫ్రెండ్ ను అత్యంత కిరాతకంగా చంపేశాడు. అతడి శరీర భాగాలను వేరు చేశాడు. గుండెను బయటకు తీశాడు, మర్మాంగాన్నీ కోసేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో జరిగిన ఈ దారుణ హత్య ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమించిన అమ్మాయి తనకు ఎక్కడ దూరమవుతుందోనని ఓ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన ఫ్రెండ్ ను అత్యంత కిరాతకంగా చంపేశాడు.

నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కాలేజీలో.. నాగర్‌కర్నూల్‌ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్‌ నవీన్‌(20) బీటెక్‌ ఫైనలియర్(ఈఈఈ) చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న హరిహర కృష్ణతో నవీన్‌కు స్నేహం ఉంది. అయితే, ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. అదే దారుణానికి దారితీసింది.

అమ్మాయి ప్రేమ విషయంలో వారి మధ్య విబేధాలు మొదలయ్యాయి. అది కేవలం గొడవల వరకే కాదు.. ఏకంగా మర్డర్ వరకు వెళ్లింది. నవీన్ వల్ల ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని భావించిన హరి.. స్నేహితుడు నవీన్ ను కిరాతకంగా చంపేశాడు.(Abdullapurmet Incident)

Also Read..Missed Call: 11 ఏళ్ల బాలిక మర్డర్ కేసులో నిందితుల్ని పట్టించిన మిస్డ్ కాల్

తాను ప్రేమించిన యువతితో తన స్నేహితుడు నవీన్ సన్నిహితంగా ఉండటం చూసి కృష్ణ ఓర్వలేకపోయాడు. తనకు సొంతం అనుకున్న అమ్మాయి.. మరో వ్యక్తితో మాట్లాడటం ఆ యువకుడికి నచ్చలేదు. దీంతో తన స్నేహితుడిని ఎలాగైనా చంపి.. ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. క్లోజ్ ఫ్రెండ్ అని చూడకుండా.. దారుణంగా హత్య చేశాడు. వారం రోజుల తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు.

పార్టీ చేసుకుందాం అని ఈ నెల 17న నవీన్‌ను.. అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో తన స్నేహితుడి రూమ్‌కు ఆహ్వానించాడు హరి. ఇద్దరు పార్టీ చేసుకుంటున్న సమయంలో అమ్మాయి గురించి గొడవ జరిగింది. వెంటనే నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్‌ చేసి గొడవ గురించి చెప్పాడు. శంకరయ్య హరితో మాట్లాడటంతో అంతటితో గొడవ ఆగింది. ఇంతలో నవీన్ నాలుగు రోజులుగా కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి శంకరయ్యకు తెలిసింది.

దాంతో నవీన్ తండ్రి శంకరయ్యకు అనుమానం పెరిగింది. ఈ నెల 22న శంకరయ్య నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంజీయూలో విద్యార్థులను, హరి స్నేహితులతో మాట్లాడారు. హరి ఫోన్‌ ఈ నెల 22న సాయంత్రం నుంచి స్విఛ్చాఫ్‌ రావడంతో.. అతడి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించారు. హరి గురించి ఆరా తీశారు.. అతడి గురించి వివరాలు తెలియలేదు.

Also Read..Nandyala : కాపురానికి వెళ్లడం లేదని కూతురును హత్య చేసిన తండ్రి

ఇంతలో శుక్రవారం(ఫిబ్రవరి 24) రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌లో హరి లొంగిపోయాడు. అమ్మాయి విషయంలో గొడవతో.. ఆమె తనకు దక్కదని భావించి నవీన్‌ను కొట్టి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారులోని హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పడేసినట్లు చెప్పాడు.(Abdullapurmet Incident)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గుండెను బయటకు తీసి.. మర్మాంగాన్ని కూడా కోసి
ఈ హత్య కేసు విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. హరిహర కృష్ణ ఒక సైకో అంటున్నారు పోలీసులు. నవీన్‌ ను కిరాతకంగా హత్య చేశాక ఈ విషయాన్ని ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయికి పంపిన మేసేజ్ దారుణంగా ఉంది. ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసి ఆ ఫొటో అమ్మాయికి పంపాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసేశాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్‌ గుండెను బయటకు తీసి ఆ ఫొటోను కూడా పంపించాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేశాడు. ఆ తర్వాత నవీన్ మర్మాంగాన్ని కూడా కోసేశాడు.